గత ప్రభుత్వాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎమ్మెల్యే మాణిక్రావు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్లో మరోమారు గులాబీ జెండా ఎగురవేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపైనే ఉందని పిలుపునిచ్చారు. కోహీర్ మండల కేంద్రంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. గ్రామాల్లో పెండ్లిళ్లు, విందులు ఉన్నా వాటిని వదులుకొని సమ్మేళనానికి వచ్చారంటే పార్టీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నదని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
కోహీర్, మే13: గతంలో అనేక ప్రభుత్వాలు పాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎంపీ బీబీపాటిల్ విమర్శించారు. శనివారం కోహీర్ పట్టణంలోని ఎస్ఎస్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పథకాలు అందుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24గంటల నిరంతర కరెంటు ఇస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ను గెలిపించాలని సూచించారు. ఎమ్మెల్యే మాణిక్రావు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాడని, జహీరాబాద్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా కోహీర్లో రెండు హైమాస్టు లైట్లు కావాలని బీఆర్ఎస్ నాయకుడు అన్నాన్ జావీద్ ఎంపీని కోరారు. కోహీర్ ప్రయాణికుల అవసరార్ధం పూర్ణాకు వెళ్లే రైలును స్టేషన్లో కొద్దిసేపు నిలిపేలా చూడాలన్నారు. ఇందుకు స్పందించిన ఎంపీ బీబీపాటిల్ రెండు హైమాస్ట్ లైట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైలును కోహీర్ స్టేషన్లో ఆపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కోహీర్ పట్టణంలో చేపట్టిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి భారీ ఊరేగింపుతో తరలివచ్చారు. ఎమ్మెల్యే మాణిక్రావు ప్రత్యేక వాహనంపై నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ సమావేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. బాజాభజంత్రీల మోతలు, పటాకులు కాలుస్తూ కేసీఆర్ జిందాబాద్, ఎమ్మెల్యే మాణిక్రావు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కళాకారులు ఆటపాటలతో ఉర్రూతలూగించారు. కార్యకమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మైనార్టీ కమిషన్ సభ్యుడు తన్వీర్ఆహ్మద్, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు బంటు రామకృష్ణ, సర్పంచులు రవికిరణ్, నర్సింహులు, రమేశ్, రాజశేఖర్, సంగారెడ్డి, కృష్ణ, ఎంపీటీసీ బక్కారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వహీద్, మాజీ వైస్ ఎంపీపీ జావీద్, కలీం, సుభాశ్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, మోహిజోద్దీన్, రాజు, రత్నం, మొగులయ్య, సాయిలు, సిద్దప్ప, ఆనంద్, బాబు, నర్సింహులు, తుక్కప్ప పాల్గొన్నారు.
మతాల పేరుతో బీజేపీ ప్రజలను విడగొడుతున్నది. వాళ్లు ప్రతిదానికి జైశ్రీరాం అంటారు.. మేము అనలేమా. మాకు శ్రీరాముడు దేవుడు కాడా.? శ్రీరాముడు మనందరికీ దేవుడే. ఇలాంటి చిల్లర పనులు చేసినందుకే కర్ణాటక ఎన్నికల్లో బుద్ధి చెప్పిండ్రు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు అలాంటి వేషాలు ఇక్కడ పని చేయవు.
– నర్సింహులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ సార్ మాహిళలకు ప్రాధాన్యమిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే అంగన్వాడీ కేంద్రాల పౌష్టికాహారం అందిస్తున్నారు. మహిళలకు అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలుగా అవకాశం కల్పిస్తున్నారు. ఇంతమంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి సీఎం చేయాలి.
– శాంతమ్మ, మాజీ జడ్పీటీసీ కోహీర్
– ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు
కోహీర్ పట్టణంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనానికి ఇంత భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావడం సంతోషంగా ఉంది. గ్రామాల్లో పెండ్లిళ్లు, విందులు ఉన్నా కూడా వాటిని వదులుకొని ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారంటే పార్టీమీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నది. ఎండలు ఎక్కువగా ఉన్నా ఇక్కడికి వచ్చినందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.