మెదక్ అర్బన్, జూలై 9 : రోడ్డు ప్రమాదాలతో రహ దారులు రక్తసిక్తం అవుతున్నాయి. వాహనాల ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతుండగా. ఎందరో తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంగా మారుతున్నారు. ఇం టి పెద్దదిక్కు లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డు న పడి, బాధితుల జీవితాలను కల్లోలం చేస్తున్నాయి. మెదక్ జిల్లాలో మూడు జాతీయ రహదారులు ఉన్నా యి. హైదరాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా నాగపూర్ వెళ్లే 44వ జాతీయ రహదారి, బాలానగర్ నుంచి నర్సాపూర్, మెదక్ మీదుగా వెళ్లే 765, హైదరాబాద్ నుంచి సంగారెడ్డి, జోగిపేట, పెద్దశంకరంపేట మీదుగా 161 జాతీయ రహదారి ఉన్నాయి. వాహనాల అతివేగంతో ప్రతిరోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నా యి. జాతీయ రహదారులపై వాహనాల వేగ పరిమితి ఉన్నప్పటికీ వాహనదారులు పట్టించుకోవడం లేదు. సూచించిన వేగం కంటే ఎక్కువగా వాహనాలను నడపడంతో పాటు నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చేస్తున్నారు.
ఆరు నెలల్లో 253 ప్రమాదాలు
జిల్లాలో ఆరు నెలల(జనవరి నుంచి జూన్) వ్యవధి లో 253రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమా దాల్లో 147 మంది మృతి చెందగా, 218 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనా ల అధిక వేగమే కావడం ఆందోళనకు గురిచేస్తున్నది.
అనాథలుగా మారుతున్న చిన్నారులు
జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమా దాలకు అతివేగమే ప్రధాన కారణం. మితిమీరిన వేగం తో వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ పెద్దలు మరణించడంతో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడి వైద్యచికిత్స కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. పేద కుటుంబాల్లో చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. కుటుంబ పెద్దలు ప్రమాదాలకు గురికావడం తో చదువుకోవాల్సిన చిన్నారులు కుటుంబాలను పో షించడానికి పనిచేస్తూ చేదోడుగా నిలుస్తున్నారు.
– కంటైనర్లు ఢీకొన్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు సజీవదహనం
44వ జాతీయ రహదారిపై కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న కంటైనర్ చేగుంట హైవే వద్ద ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టడంతో కంటైనర్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఇటీవల కొల్చారం మండలకేంద్రం వద్ద కారు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన బార్యాభర్త, కూతురు, తమ్ముడు మృతి చెందారు. ఉమ్మడి కుటుంబంలోని పెద్దలు మరణించడంతో చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన లేదా క్షతగాత్రుల కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి.
పోలీసుల అవగాహన.. మారని వాహనదారులు
రోడ్డు ప్రమాదాల-నియంత్రణపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడంలేదు. అతి వేగంగా వాహనాలను నడుపొద్దని, విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరుతున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనదారు లు విధిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ జరిమానా విధిస్తున్నా మారడం లేదు. వాహనదారులు బాధ్యతగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలను నివారించాలి.