సంగారెడ్డి అర్బన్, మే 11 : వ్యవసాయంతోపాటు ప్రభుత్వ రం గాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం, సంపద, రక్షణ కోసం స్వాతంత్ర పోరాటం జరిగిందని కానీ, నేడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బ్రిటిష్ వలసపాలకుల విధానాలనే కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగం కరోనా కాలంలో కూడా 29లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసిందని, ఇంతటి ఉపయోగకరమైన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. రైల్వే, ఎల్ఐసీ ఇతర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దుర్మార్గమన్నారు. ఉపాధి హామీ ప థకాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని, కనీస వేతనాలు అమలు కా వడం లేదని, కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలన్నారు. ముం దుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు, నేతలు ప్రసాద్, రాంచందర్, ఐల య్య, వెంకటేశ్వరరావు, పద్మ, జయరాజు, మాణిక్యం పాల్గొన్నారు.