మెదక్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : జాతీయ రహదారులపై ఎకడ లేన్ డ్రైవింగ్ అమలవడం లేదని, జాతీయ రహదారులపై ట్రాఫిక్ సమస్యలు, ఈ- చలాన్ల అంశాలపై గురువారం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రశ్నోత్తరాల సెషన్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. కుడివైపు లేన్లో తేలికపాటి వేగంగా వెళ్లే వాహనాలు వెళ్లాల్సి ఉండగా లారీలు లాంటి వేగంగా వెళ్లే వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్సీ సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం గతంలో తకువగా ఉండేదని స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జాతీయ రహదారుల విస్తీర్ణం పెరిగిందని.. సుమారుగా 4వేల కిలోమీటర్లకు చేరుకుందని అన్నారు. గతంలో ఆదిలాబాద్ ఖ మ్మం లాంటి పట్టణాలకు వెళ్లడానికి 9 గంటలు పట్టేదని, జాతీయ రహదారుల విస్తీర్ణం పెరగడం వల్ల నాలుగు ఐదు గంటల వ్యవధిలోనే వెళ్తున్నామని తెలిపారు.
అయితే ఈ జాతీయ రహదారులపై 60 కి.మీ స్పీడ్ దాటగానే చలాన్లు పడుతున్నాయని, ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించారో లేక జాతీయ రహదారుల సంస్థ వారు నిర్ణయించారో తెలియదు కానీ, వాహన దారులపై విపరీతమైన చలాన్ల భారం పడుతున్నదని తెలిపారు. 60 కి.మీ. స్పీడ్ లిమిట్ ఉంటే దానిని జాతీయ రహదారి అని ఎందుకు అంటామని, వాహన దారుల స్పీడ్ లిమిట్ చలాన బాధకు నిదర్శనంగా, చలాన్ల లిస్ట్ను సభలో సభ్యులకు ఎమ్మెల్సీ చూపించారు. ఈ సమస్య సభలోని సభ్యులందరితో పాటు సామాన్య ప్రజలకు కూడా ఉందని, కాబట్టి జాతీయ రహదారులపై స్పీడ్ లిమిట్ను 85-90 వరకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్సీ కోరారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు పదేపదే చేసే వారికి చలాన్లు విధించడంతో పాటు రోడ్డుపై ట్రాఫిక్ నియమాలు పాటించే డ్యూటీ కొన్ని రోజులు చేసే విధంగా నిబంధనలు తీసుకురావాలని మంత్రికి సూచించారు.