మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పాపన్నపేట, ఫిబ్రవరి 5: పేదల సొంతింటి కల త్వరలో నెరవేరనున్నదని మెదక్ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మం డల కేంద్రమైన పాపన్నపేటలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అం దజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. గతం లో ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అంతకుముందు మండల కేంద్రమైన పాపన్నపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ దవాఖానను ప్రారంభించారు. అనంతరం కుర్తివాడ సమీపానగల హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గడీల శ్రీనివాస్రెడ్డి, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎంపీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కుభేరుడు, వివిధ గ్రామాల నాయకులు బాలాగౌడ్, సొంగ దుర్గయ్య, కుర్తివాడ శ్రీనివాస్, ఎంకేపల్లి సర్పంచ్ మల్లేశం, మల్లంపేట సర్పంచ్ బాపురెడ్డి పాల్గొన్నారు.