కేసీఆర్కే దక్కిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన చేతి వృత్తుల వారికి ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థికసాయం చెక్కులను బుధవారం హుస్నాబాద్లో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రూ.లక్ష సాయం అందజేస్తున్నారన్నారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. –
హుస్నాబాద్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని అన్నికులాల వారికి సమన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ఎంపీపీ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కుల వృత్తులవారికి ప్రభుత్వం అంద జేసిన ఆర్థికసాయం చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేనివిధంగా చేతి వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిసాయం ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు వేలేర్మండలంలోని రెండు గ్రామాలకు చెందిన మొత్తం బీసీ కుల వృత్తిదారుల నుంచి 7,232 దరఖాస్తులు వచ్చాయని, సర్వే అనంతరం 6,022 దరఖాస్తులను ఆమోదించామన్నారు. మొదటి విడతగా 295 చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా అర్హులకు చెక్కులు అందజేస్తామ ని, మొదటి దఫాలో రానివారు నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ రూ.లక్ష సాయం అందుతుందన్నారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వృత్తిదారులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మీబీలూనాయక్, కొక్కుల కీర్తి, కొత్త వినీత, ప్రభాకర్రెడ్డి, అనిత, స్వప్న, జడ్పీటీసీలు భూక్య మంగ, నాగరాజు శ్యామల, రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, ఆవుల మహేందర్, పెసరు సాంబరాజు, మామిడి అంజయ్య, పట్టణాధ్యక్షుడు ఎండీ అన్వర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీసీ కులస్తులకు ఆర్థికసాయం చేసి వృత్తిదారులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. బీసీలకు ఆర్థికసాయం ఇస్తారని అనుకోలేదు. గతంలో రుణం కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్లం. రుణం ఇచ్చినా బ్యాం కుతో ముడిపెట్టే వారు. దీంతో బ్యాంకు వారు డబ్బులు ఇచ్చేవారు కాదు. సీఎంకేసీఆర్ నేరుగా చెక్కులు ఇస్తూ సామగ్రిని కొనుగోలు చేసుకునేందుకు ప్రోత్సాహం ఇస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్కు కృతజ్ఞతలు.
– తుపాకుల సాగర్, బస్వాపూర్ -కోహెడ మండలం
వృత్తిరీత్యా వడ్రంగిని. సర్కారు ఇ చ్చిన సాయంతో మరింత ఉత్సాహం తో నా వృత్తిని చేసుకుంటా. ఇన్ని రో జులు పెట్టుబడి లేక సామగ్రిని కొనలేక ఎన్నో ఇబ్బందులు పడ్డా. సర్కా రు ఇచ్చిన రూ.లక్ష సాయంతో పనిము ట్లు కొని వృత్తిలో ముందుకు పోతాననే ధైర్యం వచ్చిం ది. వృత్తిదారులకు సాయం చేయడం ఆనందంగా ఉంది. వృత్తులను ప్రోత్సహిస్తున్న సర్కారు ఎల్లప్పుడు ఉండా లె. సీఎం కేసీఆర్కు కుల వృత్తులవారు అండగా ఉంట రు. వచ్చే ఎన్నికల్లోనూ మద్దతు తెలుపుతారు.
– ఎగ్గోజు రమేశ్, హుస్నాబాద్ పట్టణం