శివ్వంపేట, జనవరి 14 : దివంగత కాముని గోనయ్య శివ్వంపేట మండల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమ ని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి అన్నారు. గోమారం గ్రామంలో గోనయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోనయ్య విగ్రహాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాముని గోనయ్య ఏ పదవి లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడి పరిష్కరించేందుకు ముందు వరుసలో ఉండే వారన్నారు. బీసీ నాయకుడిగా ఉంటూ గంగపుత్ర సంఘానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడని, అలాంటి మహనీయుడు మన మధ్యలేకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, సర్పంచ్ లావణ్యామాధవరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు నర్సింహారెడ్డి, దశరథ, సేవారత్న అవార్డు గ్రహీత బండారి గంగాధర్, బీ ఆర్ ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్రెడ్డి, నాయకులు కాముని అనీల్, నగేశ్, గోనయ్య అభిమానులు పాల్గొన్నారు.
మాజీ ప్రజాప్రతినిధులను పరామర్శించిన ఎమ్మెల్యే…
మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కర్రె వెంకటేశం తల్లి కిష్టమ్మ అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. శనివారం అంత్యక్రియలను నిర్వహించగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి కిష్టమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. వెంకటేశంతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వెల్దుర్తి మాజీ ఎంపీటీసీ అశోక్గౌడ్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ మోహన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, వార్డు సభ్యులు శాఖారం శ్రీను, నాయకులు కృష్ణాగౌడ్, శ్రవణ్, సంతోశ్ ఉన్నారు.