బెజ్జంకి, జనవరి 19 : కంటి సమస్యల రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కం టి సమస్యలతో ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదని సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు.
బేగంపేటలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రానికి చెం దిన కందుకూరి రవీందర్ ఇటీవల మృతిచెందగా, ఎమ్మెల్యే మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఎంపీడీవో రాము, సర్పంచులు మం జుల, సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ య్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, వైద్యాధికారి వినోద్బాబ్జీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.