చేర్యాల, మార్చి 26: చేర్యాల ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి అసెంబ్లీలో ప్రస్తావించారు. చేర్యాల మండలంలోని నాగపురి, శభాష్గూడెం, వేచరేణి, పెదరాజుపేట గ్రామాలకు చేర్యాల పోలీస్స్టేషన్ పరిధిలోకి మార్చాలన్నారు. వాస్తవంగా నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర ప్రభుత్వ శాఖల అధికారుల కోసం చేర్యాలకు వస్తుంటారన్నారు. పోలీస్స్టేషన్ సమస్యలపై మాత్రం ఆ గ్రామాల ప్రజలు కొమురవెల్లి పోలీస్స్టేషన్కు వెళ్లాల్సి వస్తున్నదని, వెంటనే ఆ గ్రామాలను చేర్యాల పోలీస్స్టేషన్కు బదిలీ చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.
మద్దూరు మండలం నుంచి చేర్యాల మండలానికి అర్జునపట్ల, కమలాయపల్లి గ్రామాలను ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడి చేర్యాలకు బదిలీ చేయించారు. నిత్యం చేర్యాల ప్రాంత సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గళమెత్తుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సూచనల మేరకు నాలుగు గ్రామాలను చేర్యాల పీఎస్కు మారుస్తామని మంత్రి శ్రీధర్బాబు జవాబు ఇచ్చారు.