కాంగ్రెస్ డౌన్.. డౌన్.., అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో పల్లెలు, పట్టణాలు దద్దరిల్లాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరంలేదంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం ఆందోళనలు కొనసాగాయి. రైతులతో కలిసి ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శవయాత్రలు నిర్వహించి, దిష్టిబొమ్మలు దహనం చేశారు. భారీ ర్యాలీలు తీసి, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వేళలా రైతులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ సర్కారుపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబించి ప్రజల ఛీత్కారానికి గురైన కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, వారిని ఊరి పొలిమేరల్లోకి రానివ్వొద్దని రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ అంధకారమౌతుందన్న వారికి ప్రస్తుతం నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటుతో ఎకరం కాదు.. మూడు గుంటల భూమి కూడా తడవదన్నారు. రాహుల్, సోనియా గాంధీలతో పాటు మల్లిఖార్జున్ ఖర్గేలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మెదక్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని, ఉచిత విద్యుత్ వద్దన్న నాయకులను ఊరి పొరిమేరల్లోకి రానివ్వొద్దని సూచించారు. 70 ఏండ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహా ధర్నా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి హెడ్ పోస్టాఫీస్ అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, పట్టణాధ్యక్షుడు గంగాధర్లతో పాటు మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ గతం లో కాంగ్రెస్ కరెంటు ఇవ్వలేదు.. కరెంటు కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశామని గుర్తు చేశారు. ఐదారు గంటల కరెంటుతో రైతు పొలం వద్ద తీవ్ర ఇబ్బందులు పడ్డాడని, రాత్రి పూట కరెంటుతో పాము కాటుకు గురై మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు ఉచితంగా 24 గంటలు ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ బేషరుతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో జోకర్గా రేవంత్రెడ్డి ఉన్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎక్కడ కనబడినా నిలదీయాలని ప్రజలకు, రైతులకు పిలుపునిచ్చారు. దేశంలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎం పీటీసీలు, రైతుబంధు సమన్వయ సమితి సభ్యు లు, రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని విస్మరించిన చంద్రబాబు వారసుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని, బాబు హయాంలో రైతాంగంపై గుర్రాలతో తొక్కిస్తూ పోలీసు కాల్పుల ఘటన జరిపించారని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతాప్రభాకర్ ఎద్దేవా చేశారు. గురువారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం ఎదుట రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చింతాప్రభాకర్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కరెంటు సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు హైదరాబాద్లో నిరసన తెలుపగా, కాల్పులు జరిపించి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు సమస్యలు అధికమై తీగలపై బట్టలు ఆరేసుకోడానికే పనికి వస్తాయన్న నాయకులు కనుమరుగు అయ్యారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని ఎద్దేవా చేశారు. దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయని, ఏ రాష్ట్రం లో లేని విధంగా, తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా దేశ చరిత్రలో నిలిచిందని ఆయన కొనియాడారు. తక్షణమే రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు రాహుల్, సోనియా గాంధీ, ఖర్గే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు ప్రజల ముందు నాటకాలు ప్రారంభించి లబ్ధ్దిపొందాలనుకునే వారికి తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్దిచెబుతారని పలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది ఎంపీపీ సరళ, కౌన్సిలర్లు శ్రీకాంత్(నాని), విష్ణువర్ధ్దన్, అశ్విన్ కుమార్, సమీ, రామప్ప, సోహైల్ అలీ, పట్టణాధ్యక్షుడు ఆర్. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, నాయకులు పాల్గొన్నారు.
రద్దుల కాంగ్రెస్ మాకొద్దు సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పాలనే మాకు ముద్దని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. 24 గంటల ఉచిత కరెంట్పై రేవంత్ రెడ్డి అనుచిత వాఖ్యలకు నిరసనగా గురువారం జోగిపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆపార్టీ నాయకులు మాట మాట్లాడితే ప్రతీ పథకాన్ని రద్దు చేస్తామంటున్నారని తెలంగాణ ప్రజలు, రైతులు మాత్రం రద్దుల కాంగ్రెస్ మాకొద్దు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతు భీమా అమలు చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో రైతులకు 24గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతూ సమయానికి పంట పెట్టుబడి, సబ్సిడీ పథకాలు అందుతూ సంతోషంగా ఉన్నారని, ఇవన్నీ చూసి కాంగ్రెస్కు కండ్లమంటగా ఉందన్నారు. మూడు గంటల కరెంటుతో ఎకరం కాదు కదా.. మూడు గుంటల భూమి కూడా తడవదని వ్యవసాయం అవగాహన లేని నాయకులకు కరెంట్, వ్యవసాయం విలువ ఏం తెలుస్తదని అన్నారు. ధరణితో ఎన్నో ఎండ్లనాటి భూముల సమస్యలు తొలిగి గంటల వ్యవధిలో రిజిస్టేషన్లు జరుగుతూ అక్రమాలకు అడ్డుకట్ట పడిందని దీన్ని సైతం కాంగ్రెస్ నాయకులు రద్దు చేస్తామంటున్నారని ధరణి ఉండాలా..? వద్దా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఎంపీపీ బాలయ్య, పట్టణాధ్యక్షుడు శ్రీధర్, మాజీ అధ్యక్షుడు వెంకటేశం, రేణుకా ఎల్లమ్మ ఎత్తి పొతల చైర్మన్ లింగాగౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణాగౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రేవంత్రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే గల్లీలకు రా తేల్చుకుందాం. ఎక్కడో అమెరికాలో కూర్చొని సీఎం కేసీఆర్పై అవాకులు, చివాకులు మాట్లాడడం సరికాదు. వ్యవసాయం చేసేవాడికే తెలుస్తది. నీ తోటి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు.. నువ్వు ఏం చేస్తున్నవో.. గుర్తుకు తెచ్చుకో, పద్ధ్దతిగా మాట్లాడు.. లేకుంటే తెలంగాణలో ఉన్న రైతులు నిన్ను తరిమికొడతరు జాగ్రత్త.
-గజవాడ నాగరాజు, రామాయంపేట బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు
వ్యవసాయం తెలిసినోడు ఇట్ల మాట్లాడడు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఇప్పుడు ఐదు ఎకరాలను సాగు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడ్తున్నయ్,. 24 గంటల కరెంట్ వస్తుంది. నీకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలువు అప్పుడు చూస్తం.
-దేమె యాదగిరి, లయన్స్క్లబ్ జిల్లా చైర్మన్, రామాయంపేట
ఎవుసంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న రేవంత్రెడ్డికి కర్రు కాల్చి వాతలు పెట్టాలి.. అట్లయితే జర జాగ్రత్తగా మాట్లాడతడు. అసలు ఎవుసం గురించి తెలిసినోడు ఇట్ల మాట్లాడడు. అమెరికాలో ఉండి వెర్రి కూతలు కూయడం కాదు. రా ఇండియాకు రా నీ సంగతి చెబుతాం బిడ్డ. తెలంగాణకు వచ్చి మాట్లాడు బీఆర్ఎస్ పవర్ను చూపిస్తం. మూడు గంటల కరెంట్ మూడు గుంటలు కూడా పారదు.
-కర్రు రమేశ్ బీఆర్ఎస్వీ జిల్లా నేత, రామాయంపేట
ఎవుసంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న రేవంత్రెడ్డికి కర్రు కాల్చి వాతలు పెట్టాలి.. అట్లయితే జర జాగ్రత్తగా మాట్లాడతడు. అసలు ఎవుసం గురించి తెలిసినోడు ఇట్ల మాట్లాడడు. అమెరికాలో ఉండి వెర్రి కూతలు కూయడం కాదు. రా ఇండియాకు రా నీ సంగతి చెబుతాం బిడ్డ. తెలంగాణకు వచ్చి మాట్లాడు బీఆర్ఎస్ పవర్ను చూపిస్తం. మూడు గంటల కరెంట్ మూడు గుంటలు కూడా పారదు.
-కర్రు రమేశ్ బీఆర్ఎస్వీ జిల్లా నేత, రామాయంపేట