మెదక్,(నమస్తే తెలంగాణ)/చిన్నశంకరంపేట/పాపన్నపేట/రామాయంపేట, మే 10 : తెలంగాణ రాష్ర్టాన్ని రాబోయే కాలంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతాం.. ఇది మా సంకల్పం… మీరిచ్చిన నిర్ణయం. బీజేపీకి నెత్తి..కత్తి ఏది లేదు. కళ్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుడే తప్ప కేంద్ర ప్రభుత్వం చేసేదేమి లేదు.కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్దికే కట్టుబడి ఉంటాం..! అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం రామాయంపేటకు విచ్చేసిన ఆమె 160 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూ. కోటి 60 లక్షల చెక్కులను అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
రాబోయే కాలంలో ఇంటి స్థలాలున్న ప్రతి ఒక్కరికీ రూ.3 లక్షలు ప్రభు త్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండారి మహేందర్రెడ్డి, గజవాడ రాజు, మాజీ ఎంపీటీసీ సిద్దిరాం రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ ఎండీ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, దేమె యాదగిరి, సుందర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు సరాఫ్ శ్యాం కుమార్, చింతల రాములు, ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు సుభాష్ నాయక్, సురేశ్ నాయక్, మల్లేశం, మహేశ్, శంకర్, రాణమ్మ, మల్లన్నగారి నాగులు, పురపాలిక కో-ఆప్షన్ సభ్యులు ఎస్కె.అహ్మద్, బాబు, సైదయ్య తదితరులు ఉన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతన్నలు పెద్ద ఎత్తున పంట నష్టపోయారని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొను గోలు చేసి ఆదుకుంటుందని ఆమె వెల్లడించారు.
అనారోగ్యాల బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనందిస్తున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16మంది లబ్ధిదారులకు రూ. 8,11, 500 లక్షల చెకులను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు. చిన్నశంకరంపేటలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు తహసీల్దార్ మహేందర్గౌడ్, సర్పంచ్లఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచ్లు మీనా, నీరజ శ్రీనివాస్రెడ్డి, రమేశ్, భిక్షపతిగౌడ్, పోచయ్య చైర్మన్లు అంజిరెడ్డి,శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.