పెద్దశంకరంపేట, నవంబర్ 6: కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకట్లు ఏర్పడడం ఖాయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలంలోని కొత్తపేట, జూకల్, సంగారెడ్డిపేట, వీరోజిపల్లి, పెద్దశంకరంపేట పట్టణంతోపాటు ఉత్తులూర్, శివయపల్లి, రామోజిపల్లి, మాడ్చట్పల్లి, దానంపల్లి, మూసాపేట, భూర్గుపల్లి, మఖ్త లక్ష్మాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారి రాజ్యం వస్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దూకి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ప్రజలకు మోసం చేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అక్కడ అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు.
తెలంగాణ రాష్ర్టానికి మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని బంధువులను ఎవరిని అడిగినా కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తున్నారన్నారు. 60 ఏండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు కష్టాలు తప్పలేదని, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3000 సీఎం కేసీఆర్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యునిటీ హల్స్, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు, మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, రైతు బంధు పథకం ద్వారా పంట పెట్టుబడి అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే నంబర్వన్ సీఎం కేసీఆర్ అని అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించి స్వరాష్ర్టాన్ని సాధించిన అనంతరం తెలంగాణను ఆదుకున్నది సీఎం కేసీఆర్ సారే అన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లుగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి బడుగు. బలహీన వర్గాల వారికి అండగా నిలిచారన్నారు.
గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తల కృషితో మంచి మెజార్టీతో గెలిపించారని ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యకర్తలే నా బలం.. బలగం అని… ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారని, తనను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేశ్గౌడ్, మండ ల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీపీ బాసాడ రాజు, నాయకులు వేణుగోపాల్గౌడ్, సుభాశ్గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.