చిలిపిచెడ్, మార్చి 16 : నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తునట్లు ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. గురువారం చిలిపిచెడ్లో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ వినోద అధ్యక్షతన సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. నర్సాపూర్ నియోజకవర్గంలో 84 నూతన గ్రామ పం చాయతీ భవనాలు మంజురు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మార్చి చివరిలో పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో కరెంట్ సమస్యలు లేకుండా విద్యుత్ అధికారుల పనిచేయాలని సూచించారు.
అనంతరం ఏపీఎం ప్రేమలత అధ్యక్ష తన మండలంలోని 2018-19, 2019-20 ఆర్థిక కాలానికి మొత్తం 323 మహిళా సంఘలకు రూ.12.14 కోట్ల ను వడ్డీ లేని రుణాలుగా పంపిణీ చేశామన్నారు. పీఆర్ ఏఈ మధుబాబు మాట్లాడుతూ.. ‘మనఊరు -మనబడి’ పనుల ను తర్వలో పూర్తి చేస్తామన్నారు. శీలంపల్లి, కౌడిపల్లిలో చేపట్టిన బీటీ రోడ్డు పనులు మార్చి నెలఖారులోగా పూర్తి చేస్తామని తెలిపారు. డీఈ కిషన్ మాట్లాడుతూ.. ఇంటింటికీ మిష న్ భగీరథ పథకంలో తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నా రు. సమావేశంలో వైస్ఎంపీపీ విశ్వంభరస్వామి, ఎంపీడీవో శశిప్రభ, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, సుభాష్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఆడపిల్ల భారం కాదు : ఎమ్మెల్యే మదన్రెడ్డి
ఆడపిల్లలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. చిలిపిచెడ్లోని రైతు వేదికలో మండలానికి చెందిన 40 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్న ఇంటికి సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా ఉన్నారని, తెలంగాణలో ఆడపిల్ల భారం కాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, తహసీల్దార్ ముసాద్దీక్, ఆర్ఐ నాగరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, పీఏసీఎస్ వైస్చైర్మన్ రామచంద్రారెడ్డి, సర్పంచ్ లక్షదుర్గారెడ్డి, ఎంపీటీసీ సుభాష్రెడ్డి, బీఆర్ ఎస్ మాజీ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, కోఅప్షన్ సభ్యుడు షఫీయొద్దీన్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సయ్యద్ ఉస్సేన్, సర్పంచ్లు గోపాల్రెడ్డి, మాంతప్ప, పరశురాంరెడ్డి, యాదగిరి, భిక్షపతినాయక్, శంకర్నాయక్, కవిత, స్వరూప, మనోహర, బుజ్జిబాయి, ఎంపీటీసీలు మల్లయ్య, మల్లమ్మసంగాగౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ వీరాస్వామి, నాయకులు మాణిక్యరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కిషన్రెడ్డి, విఠల్ పాల్గొన్నారు.
ఆడపడుచులకు ‘కల్యాణ లక్ష్మి’ వరం
కౌడిపల్లి, మార్చి 16 : తెలంగాణ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కౌడిపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలు, గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవితాఅమర్సింగ్, సర్పంచ్ పోరం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సార రామాగౌడ్, సర్పంచులు రాజేందర్, మహిపాల్రెడ్డి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లిలో నాలుగు ఆలయాల పునరుద్ధరణ
కౌడిపల్లి గ్రామంలో నాలుగు నూతన ఆలయాల పునరుద్ధరణకు ఎమ్మెల్యే మదన్రెడ్డి భూమిపూజ చేశారు. కౌడిపల్లి మండలకేంద్రంలో తెల్లవారుజామున శివాలయం, గంగమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మతల్లి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవలే కౌడిపల్లిలో దాసాంజనేయ, పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాలను నిర్వహించి, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించా మన్నారు. స్వగ్రామం కౌడిపల్లిలో ప్రతి ఆలయాన్ని సొంత డబ్బులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలుముల వెంకటేశ్వర్రెడ్డి, సొసైటీ వైస్చైర్మన్ చిన్నంరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ దుర్గారెడ్డి, ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్గౌడ్, నాయకులు అంపటి సత్యనారాయణ, మాటూరి శాఖయ్య, మల్లేశం, కిషన్, లక్ష్మణ్, పెంచలయ్య పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
కొల్చారం, మార్చి 16 : మండలంలోని రంగంపేటకు చెందిన ఎండీ రషీద్కు మంజూరైన రూ.20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును రంగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు గోకని రాజాగౌడ్కు ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేశారు.