శివ్వంపేట, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం దేశానికే గర్వకారణమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా శివ్వంపేట మండలం చండి గ్రామంలో ఏర్పాటుచేసిన కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ ఉమాఅనిల్ప్రసాద్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మదన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంత గొప్ప కార్యం గతంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాలేదని ఒక్క కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు.
మన పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవడం మన ప్రగతికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరు కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో-ఆప్షన్ మన్సూర్, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటరాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, గ్రామకమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీలక్ష్మణ్, డాక్టర్ సంగీత, వైద్య సిబ్బంది అంజాద్, నాగరాణి, విజయలక్ష్మి, స్వప్న, హర్ష, వీరమణి, గోపమ్మ, కృష్ణవేణి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు
చేగుంట, మార్చి 28: కంటి వెలుగుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో రెండో విడత కంటివెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ బస్కె స్వప్నాఅంజిరెడ్డి, ఎంపీటీసీ గాండ్ల లతానందంతో కలిసి కంటివెలుగు శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటిచూపు తక్కువై ఇబ్బందులు పడుతున్న నిరుపేదల కోసం కంటివెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనిల్కుమార్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, ఉప సర్పంచ్ మ్యాకల రామచంద్రం, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నయనం ప్రధానం : బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి
తూప్రాన్, మార్చి 28: సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ తూప్రాన్ మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఇస్లాంపూర్లో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ఆయన గ్రామ సర్పంచ్ సుకన్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఏమవసరమో గుర్తించి అడగకున్నా అందించే విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రమేశ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఖాజాపూర్లో కంటివెలుగు శిబిరం ప్రారంభం
చిన్నశంకరంపేట, మార్చి 28: మండలంలోని ఖాజాపూర్లో మంగళవారం సర్పంచ్ కుంట నాగలక్ష్మి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎల్పివో రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, మెడికల ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు, ఉప సర్పంచ్ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.