ఆచరణ సాధ్యం కాని గ్యారెంటీలతో అబద్ధపు హామీలిస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతాయని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం మాసాయిపేట, మండలంలోని స్టేషన్ మాసాయిపేట, అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో వారిరువురు కలిసి ప్రచారం చేశారు.
వెల్దుర్తి, నవంబర్ 19: రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన మాసాయిపేట, మండలంలోని స్టేషన్ మాసాయిపేట, అచ్చంపేట, హకీంపేట గ్రామా ల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతిపక్షాల పాలనలో ఏనాడు గుర్తుకు రాని పథకాలను నేడు అమలుచేస్తామని అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడుతూ అందరిని ఆదుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలను రద్దు చేయాలని, సంక్షేమాన్ని ఆడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు లక్షల కోట్లతో పథకాలు అమలుచేస్తామంటూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారన్నారు.
మహిళలు, యువతులు, కులవృత్తుల వారికి, రైతులు, వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి వంటి ఎన్నో పథకాలను అందిస్తూ అందరిని ఆదుకుంటున్నారన్నారు. కేవలం పదవులు పొందేందుకు కాంగ్రెస్, బీజేపీల నాయకులు మాయమాటలు చెబుతున్నారన్నారు. ఎన్నికల అనంతరం మళ్లీ ప్రజలకు వారి ముఖాలు కనిపించవన్నారు. ప్రతిపక్ష పార్టీల హైకమాండ్ ఢిల్లీలో ఉన్నదని, వారు ఏది చెబితే ఇక్కడ ఉన్నవారు అది చేయాలని, ఇక్కడి ప్రజల పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమం ఢిల్లీ వాళ్లకు ఏం తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అని, రాష్ట్ర ప్రజలే బీఆర్ఎస్కు హైకమాండ్ అని, ప్రజల అభిష్టానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలనను అందిస్తారన్నారు. ఇప్పటికే ఎవరికీ సాధ్యం కాని పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. మరోసారి కారుకు ఓటు వేసి గెలిపించి మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే సంక్షేమ పథకాలు ముందుకు సాగుతాయన్నారు.
మాసాయిపేట ప్రచారం సందర్భంగా మహిళలు భారీగా తరలివచ్చారు. గులాబీల జెండాలే రామక్క.. పాటకు మహిళలు కోలాటం ఆడారు. సునీతాలక్ష్మారెడ్డి కూడా వారితో కలిసి కోలాటం ఆడారు. మహిళలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు వింటూ వారితో కలిసి ముందుకు నడిచారు. అందరితో కలిసిమెలిసి ప్రచారం నిర్వహించగా అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు డప్పుచప్పుళ్లు, పటాకులు కాల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింలు, మాజీ ఎంపీటీసీ సిద్దిరాంలుగౌడ్, మాజీ సర్పంచ్ నాగరాజు, నాయకులు శ్రీనివాస్, పవన్, రమేశ్, దుర్గాపతి, నారాయణచారి, అశోక్, స్టేషన్శ్రీను, శ్రీనునాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు