శివ్వంపేట/ మెదక్ మున్సిపాలిటీ/ నర్సాపూర్/ కొల్చా రం/ వెల్దుర్తి, మే 2 : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం గూడురు గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని మంగళవారం సర్పంచ్ స్వరాజ్యలక్ష్మీశ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరం లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మ న్ వెంకటరాంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ వాణి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణాగౌడ్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్గౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, డాక్టర్ వినోద్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కంటి సమస్యలకు పరిష్కారం : మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
మెదక్ జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో కంటివెలుగు శిబిరాన్ని కౌన్సిలర్ కల్యాణి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మధుసూదన్రావు, నాయకులు దుర్గాప్రసాద్, శంకర్ ప్రారంభించారు. కంటి సమస్యలకు కంటి వెలుగు శిబిరంలో పరిష్కారం లభిస్తుందన్నారు.
కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగించుకోవాలి
నర్సాపూర్ మున్సిపల్లోని 2వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కౌన్సిలర్ లతారమేశ్యాదవ్తో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్ పరిశీలించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.
ఎనగండ్లలో కంటి వెలుగు అధికారులకు సన్మానం
కొల్చారం మండలం ఎనగండ్లలో కంటి వెలుగు శిబిరం అధికారులను ఎంపీపీ మంజుల, సర్పంచ్ వీరారెడ్డి సన్మానించారు. ఎనగండ్లలో 12 రోజులపాటు కంటి వెలుగు శిబిరం నిర్వహించి, 1900 మందికి పరీక్షలు చేశామని, 290 మంది కి అద్దాలు అందజేశామని సీహెచ్వో సుదర్శన్ తెలిపారు. కా ర్యక్రమంలో రంగంపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ హర్షిత, వైద్యాధికారి షఫిక్ అహ్మద్, సిబ్బంది మురళి, సరోజ, ఏఎన్ఎంలు తన్వీర్, మంజుల, సుధారాణి పాల్గొన్నారు.
పేదల జీవితాల్లో కంటివెలుగు: జడ్పీటీసీ రమేశ్గౌడ్
వెల్దుర్తి మండలంలోని అందుగులపల్లిలో కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ వినోద, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, నాయకులు నరేందర్రెడ్డి, నర్సింహులుతో కలిసి జడ్పీటీసీ రమేశ్గౌడ్ ప్రారంభించారు. కంటివెలుగు శిబిరాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. కార్యక్రమంలో నేతలు పాపయ్యగౌడ్, మల్లేశంగౌడ్, డాక్టర్ మౌనిక ఉన్నారు.