నర్సాపూర్, మే 8: ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చెరువులకు మహర్దశ కలిగిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి వెల్లడించారు. నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూరా చెరువుల పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మహిలా కమిషన్ చైర్పర్సన్తోపాటు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాయారావు చెరువు అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని వెల్లడించారు. రాయారావు చెరువు పూడిక తీతతో రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చిందని, అందులో కొంత వ్యయంతో చెరువును సుందరీకరించామన్నారు. ఇంకా రూ.95 లక్షలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొట్టడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ధోబీఘాట్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సందర్బంగా రజకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం
శివ్వంపేట, జూన్ 8: సీఎం కేసీఆర్ హయాంలోనే మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం వచ్చిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో గంగతెప్పలు, బోనాలు ఊరేగింపు కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, చైర్పర్సన్ సునీతాలరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ప్రతీ పథకం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అతిత్వరలోనే మండలంలో ఒక డ్యామ్ నిర్మించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అసత్య ప్రచారరాలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షురాలు లావణ్యామాధవరెడ్డి, ఎంపీటీసీ నర్సింహరెడ్డి, ఇరిగేషన్ అధికారి ఏసయ్య, మండల కో-ఆప్షన్ మెంబర్ లాయక్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్రెడ్డి, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, ఉప సర్పంచ్ కాముని శ్రీనివాస్, యువ నాయకులు వాకిటి శశిధర్రెడ్డి పాల్గొన్నారు.
కోనాపూర్లో పాల్గొన్న ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి
రామాయంపేట, జూన్ 8: రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని కోనాపూర్, దామరచెర్వు, సుతారిపల్లి, శివ్వాయపల్లి, దంతెపల్లి, అక్కన్నపేట, పర్వతాపూర్, కాట్రియాల తదితర గ్రామాల్లో చెరువుల పండుగ నిర్వహించారు. కోనాపూర్లో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఎంపీపీ భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ మత్స్యకారులతో కలిసి ర్యాలీగా చెరువు వద్దకు వెళ్లారు. రామాయంపేట పట్టణంలోని మల్లె చెరువు వద్ద సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ ఉమాదేవి, కౌన్సిలర్లు, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, దేమె యాదగిరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.