దుబ్బాక, జూన్ 29: ప్రయాణికుల సౌకర్యం కోసం కోట్లు ఖర్చుచేసి దుబ్బాకలో బస్టాండ్ భవనాన్ని నిర్మిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అధునాతన హంగులతో దుబ్బాక బస్టాండ్ భవన నిర్మాణం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోనే దుబ్బాక బస్టాండ్ మోడల్గా నిలిచిందన్నారు. ఆర్టీసీ, ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈవిషయమై దుబ్బాక డిపో ఇన్చార్జి కనకలక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సంగీతారవీందర్ పాల్గొన్నారు.