ఝరాసంగం, డిసెంబర్ 5 : ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం ఝరాసంగం మండల కేంద్రంలోని వాసవీ మండపంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం పగలు, రాత్రులు కష్టపడిన కార్యకర్తలు, నాయకులను కృతజ్ఞతలు తెలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, మండల అధ్యక్షుడు వేంకటేశం, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు హఫీజ్ పహిల్వాన్, అజీజ్ భాయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.