తొగుట, జనవరి 24: రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజె క్టు నుంచి ప్రధాన కాల్వకు బుధవారం రాత్రి ఆమె నీటిని విడుదల చేశారు. అనంతరం తొగుటలో గ్రామ పంచాయతీ, కస్తూర్బాపాఠశాల, పాఠశాల డైనింగ్హాల్, రైతు వేదిక భవనాలు, వాటర్ ట్యాంకులను ఆమె ప్రారంభించారు. అంతకు ముందు ఆమె రంగనాయకసాగర్ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అ మలు చేస్తామన్నారు.
యాసంగి పంటలు ఎండిపోకుండా చూడాలని అధికారులను ఆ దేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమన్నారు. బాలికల దినోత్సవం సం దర్భంగా కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నా రు. కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, నీటిపారుదలశాఖ ఈఈ సాయిబాబా, డీఈఈ శ్రీనివాస్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలు చెరుకు శ్రీనివాస్రెడ్డి, పూజల హరికృష్ణ, ఎంపీపీ గాంధారి లతానరేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు అక్కం స్వామి, సర్పంచ్ కొండల్రెడ్డి పాల్గొన్నారు.