సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 5: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయా ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ శరత్ పరిశీలించారు. నేడు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్కు మంత్రి చేరుకుంటారు. జీవో 59 కింద కలెక్టరేట్ ఆడిటోరియం లో లబ్ధిదారులకు దస్తావేజులు అందజేస్తారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద యం 10 గంటలకు మెడికల్ కళాశాలను సందర్శిస్తారు.
ఉదయం10.30కి జిల్లా ప్రభుత్వ దవాఖానలో క్రిటికల్ కేర్ యూనిట్, 1045కు రేడియాలజీ ల్యాబ్ ప్రారంభిస్తారు. ఉదయం 11కు వెల్నెస్ సెంటర్లోని పోలీసు అధికారుల వైద్య శిబిరాన్ని సందర్శిస్తారు. ఉదయం 11.15 గంటలకు కింది బజారులోని మురుగు కాల్వకు శంకుస్థాపన చేయనున్నారు. 11.30కు తారా ప్రభుత్వ కళాశాలలో రూ.3.24 కోట్లతో నిర్మించిన 12 తరగతి గదుల భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. 11.45కు బైపాస్ రోడ్డులో టీఎన్జీవో భవనం, మధ్యాహ్నం 12 గంటలకు మహిళా సంఘాల కోసం నిర్మించనున్న షాపింగ్ మాల్, 12.15 గంటలకు బైపాస్ రోడ్డు నుంచి దువా దవాఖాన వరకు బీటీ రోడ్డు, 12.35కు రాజంపేటలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఒంటి గంటకు సంగారెడ్డి నుంచి పటాన్చెరు చేరుకుంటారు. 1.30 గంటలకు పటాన్చెరులో మహి ళా దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పటాన్చెరు నుంచి బయలుదేరి 3.30 గంటలకు సదాశివపేట చేరుకుంటారు.
జహీరాబాద్లో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
జహీరాబాద్, మార్చి 5: జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం మండలాల్లో మంత్రి హరీశ్రావు పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కోహీర్లో నిర్మించిన 50 పడకల దవాఖానను మంత్రి ప్రారంభించనున్నారు. 5 గంటలకు జహీరాబాద్లో డీసీఎంఎస్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5.30 గంటలకు ఝరాసంగం మండలంలోని బర్థిపూర్ ఆశ్రమంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని, తిరిగి హైదరాబాద్ వెళ్తారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే మాణిక్రావు బర్థిపూర్ ఆశ్రమంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఎమ్మెల్యేతో సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ఉన్నారు.
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కోహీర్, మార్చి5: కోహీర్ దవాఖానను ప్రారంభించేందుకు మంత్రి హరీశ్రావు రానున్నారని, సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. కోహీర్లోని సామాజిక దవాఖానలో కొనసాగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయనతో ఆర్డీవో రమేశ్బాబు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, తదితరులు ఉన్నారు.
నేడు పటాన్చెరుకు మంత్రి రాక
పటాన్చెరు, మార్చి 5: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, డీఐజీ సుమతి, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.