నర్సాపూర్, నవంబర్ 10: ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభ ఉన్నందున శుక్రవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలసి సభాస్థలిని పరిశీలించారు. సభా స్థలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను నాయకులకు వివరిస్తూ సూచనలు, సలహాలు అందించారు. సీఎం కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో జనాలను తరలించి సభను విజయవంతం చేయాలని నాయకులకు సూచించారు.
మంత్రితోపాటు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ వెంకటరాంరెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, అశోక్గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమోద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పంబళ్ల భిక్షపతి, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగారావు, నాయకులు సత్యంగౌడ్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, లలితానర్సింగ్నాయక్, జగదీశ్, రాకేశ్గౌడ్, మానెయ్య తదితరులు పాల్గొన్నారు.