సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 2 : ఎమ్మెల్సీగా దేశపతి రాణించి ప్రభుత్వ అందించే సుపరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పోలీసు కన్వెన్షన్హాల్లో ఆదివారం రాత్రి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పాపయ్య అధ్యక్షతన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశపతి శ్రీనివాస్తో 22 ఏండ్ల అనుబంధం ఉందని.. తన ఎదుగుదలలో ఆయన ముద్ర ఉందన్నారు. నాడు ఉద్యమంలోనైనా.. నేటి అధికారిక కార్యక్రమాల్లోనైనా దేశపతి సహకారం ఉందన్నారు. ఎమ్మెల్సీగా బాగా రాణించి పరిపాలనలో భాగస్వామిగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టే నా లాంటి గాయకుడికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. రాజకీయ ప్రసంగాలకు పద్య పరిమళాలు అల్లిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. అలజడి ఆయన ఊపిరి.. ఆందోళనే ఆయన జీవితం.. అందుకే మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ నందినీ సిధారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల్ల శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.