అన్నీ ఇస్తున్నాం.. అందుకోవాల్సింది మీరే..
మీరు సాధించే ఉద్యోగమే మాకు బహుమతి
మంత్రి హరీశ్రావు
పోలీస్ శిక్షణ పొందిన అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ
సిద్దిపేట అర్బన్, జూన్ 26 : అన్నీ ఇస్తు న్నాం.. ఉద్యోగం అందుకోవాల్సిందే మీరే అని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జిల్లా వ్యాప్తంగా ఉచిత పోలీస్ శిక్షణ తీసుకున్న 1162 మంది అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేశారు. అంతకుముందు పోలీస్ అభ్యర్థులకు ఉపయోగపడే మెటీరియల్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. 60 రోజుల శిక్షణ పూర్తయిందంటే మీరు మొదటి మెట్టు ఎక్కినట్టే అని.. మీలో బలమైన సంకల్పం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుం డా, ప్రైవేట్, ఇతర ఉద్యోగాలు సాధించేందుకు సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మీరందరూ ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం ఉం దన్నారు. ఆత్మవిశ్వాసంతో గురి చూసి కొడితే ఆకాశానికి కూడా రంధ్రం పడుతుందని, మీరందరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. పేద కుటుంబంలో పుట్టిన కొండపాకకు చెందిన అఖిల్ ఇంటివద్దనే చదివి సివిల్స్ సాధించాడని, అతడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
తాత్కాలిక ఆనందాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటే శాశ్వతంగా సంతోషంగా ఉండే ఫలితాలు వస్తాయన్నారు. ప్రిలిమినరీ తర్వాత ఫిజికల్ టెస్ట్తో పాటు ఫైనల్స్కు కూడా శిక్షణ అందిస్తామని హామీఇచ్చారు. అన్నీ మీ చేతుల్లో ఉన్నాయని, అందుకోవాల్సింది మీరే అని మంత్రి అన్నారు. మీరు ఎన్ని ఉద్యోగాలు సాధిస్తే, అదే మాకు బహుమానమన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజనాలకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న మీరందరూ తప్పకుండా జీవితంలో విజయం సాధించాలని కోరారు. మంత్రి హరీశ్రావు కుటుంబ సభ్యులతో సమానంగా భావిం చి ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ అందించడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ సంకల్పం ఉంటే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. అందుకు ఉదాహరణ 1162 మంది ఉద్యోగార్థులకు ఇంత మంచి శిక్షణ ఇవ్వడమే అన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో ఈ శిక్షణ ఇవ్వడం సాధ్యమైందన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా తమ అధికారులు మీకు సహకరిస్తారని చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో ఫిజికల్ ట్రైనింగ్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మీరు సాధించే ఉద్యోగాలే మంత్రి హరీశ్రావుకు ఇచ్చే ధన్యవాదాలని సీపీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, హుస్నాబాద్ ఏపీసీ సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ ఫణీంద్ర, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, శిక్షకుడు భాగ్యకిరణ్ పాల్గొన్నారు.