టేక్మాల్, 17 ఏప్రిల్: మండలంలోని వేల్పుగొండ రామాచలం గుట్టపై సీతారాముల కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి మంత్రిని శాలువాతో సన్మానించారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులను అన్నదానం చేశారు. సాయంత్రం గ్రామ పురవీధుల గుండా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ భానుప్రకాశ్, ఆలయ కమిటీ భక్త బృందం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.