మెదక్ అర్బన్,డిసెంబర్ 6: పోలీసు ఉద్యోగాల భర్తీ తెలంగా ణ ప్రభుత్వం అత్యంత పక డ్బందీగా పారదర్శకంగా నిర్వహిస్తోందని మెదక్ ఎస్పీ రోహి ణి ప్రియదర్శిని అన్నారు. మం గళవారం విలేఖరుల సమావే శం నిర్వహించి పోలీసు కొలువుల కోసం సిద్ధమవుతున్న వారికి కొన్ని ముఖ్య సూచన లు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షకు వచ్చేవారు అడ్మిట్ కార్డ్, పార్ట్ 2 అప్లికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ తమవెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఈ పరీక్షల్లో మూడు భాగాలు ఉంటాయని వాటిలో రన్నింగ్కి మాత్రమే మెరిట్ మార్కులు ఉంటాయని మిగతా రెండు ఈవెంట్స్ లాంగ్జంప్, షాట్పుట్లలో క్వా లిపై అయితే సరిపోతుందని పేర్కొన్నారు.
ఈ పరీక్షకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రతి అభ్యర్థికి రన్నింగ్ టైమ్ రికార్డింగ్ కొరకు ఆర్ఎఫ్ఐడీ బ్యాండ్ వేయడం జరుగుతుందన్నారు. ఈ బ్యాండ్ ఎవరైనా ట్యాంపరింగ్కి ప్రయ త్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎత్తు కొలత కూడా డిజిటల్ పద్దతిలోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఈవెం ట్ రెండు సీసీ కెమెరాల పర్యావేక్షణలో జరుగుతుందని, దేహదారుఢ్య పరీక్షలు ఉంటుందన్నారు. అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగాలని సూచించారు.