మెదక్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)/మెదక్ మున్సిపాలిటి : కొన్నేండ్లుగా అధ్వాన రహదారితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, స్థానికుల కష్టాలు తొలగిపోనున్నాయి. గతుకుల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని పట్టణ ప్రజలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టి కి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్, మం త్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లగా మెదక్ నుంచి దాయర రోడ్డుకు రూ. 7కోట్ల 80 లక్షలు మంజూరు చేశారు. దీంతో రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి దాయర వరకు రోడ్డు మంజూరు కావడం తో స్థానికులు, ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి కృ తజ్ఞతలు తెలిపారు.
2.50 కిలోమీటర్లు.. రూ. 7.80 కోట్లు
జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుంచి దాయర వరకు 2.50కిలోమీటర్ల దూరం రోడ్డుకు రూ. 7.80కోట్లు మంజూరయ్యాయి. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వా త మెదక్ పట్టణం రూపురేఖలు మారిపోయాయి. గతం లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేంద పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుడి వరకు రోడ్డు రివైడింగ్ చేయించి మధ్యలో డివైడర్ను ఏర్పాటు చేయించారు. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రాందాస్ చౌరస్తా వరకు, ఎంపీడీవో కార్యాలయం నుంచి పంచము ఖీ హనుమాన్ దేవాలయం వరకు రోడ్డును నిర్మించడంతో ప్రయాణం సాఫీగా సాగుతోంది.
అంతేకాకుండా మెదక్ పట్టణంలోని ఆయా కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా ఏర్పాటు చేయించారు. దీంతో ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఇదిలావుండగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి దాయర రోడ్డుకు ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. ఈ రోడ్డుకు నిధులు మంజూరు కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆయా గ్రామాలకు సాఫీగా ప్రయాణం
హవేళీఘనపూర్ మండలంలోని కుచన్పల్లి, మద్దుల్వాయి, ముత్తయికోట, శేరి కూచన్పల్లి, బొగుడ భూపతిపూర్, సర్ధన, జక్కన్నపేట గ్రామాలకు చెందిన ప్రజలు, యువకులు, వ్యాపారస్తులు వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజు జిల్లా కేంద్రం మెదక్ పట్టణానికి వస్తారు. సాయం త్రం వేళల్లో తిరిగి గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు బాగాలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా మెదక్ పట్టణంలోని చమన్, దాయరకు చెందిన ప్రజలతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు రాం దాస్ చౌరస్తా నుంచి దాయర వరకు రోడ్డు మంజూరు చే యాలని పలుమార్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.
దాయర ప్రజల కల నెరవేరింది..
మెదక్ జిల్లా కేంద్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేస్తున్నారు. దీంతో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎన్నో ఏండ్లుగా మెదక్ నుంచి దాయర వరకు రోడ్డు గుంతలుగా ఉండటంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు రోడ్డు మంజూరు చేయించాలని సీఎం కేసీఆర్ను కోరాను. మెదక్-దాయర రోడ్డుకు రూ. 7.80 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డిలకు కృతజ్ఞతలు.
– పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మెదక్
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి కృతజ్ఞతలు..
మెదక్ పట్టణం నుంచి దాయర మీదుగా ఏడు గ్రామాలకు ప్రయాణికులు, ప్రజలు వెళ్తుంటారు. దీంతో రోడ్డు సరిగ్గా లేకపోవడం, గుంతలు పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఏండ్లుగా పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న రోడ్డుకు నిధులు మంజూరు కావడం సంతోషం. ఎమ్మెల్యే పద్మాదేవేంందర్రెడ్డికి రుణపడి ఉంటాం.
– అవారి శేఖర్, 23వ వార్డు కౌన్సిలర్