ఆంగ్ల నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. 31 రోజున అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు కేక్లు కట్చేసి చేసి ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిఠాయిలు తినిపించుకుని విందు వినోదాల్లో ముగిని తేలారు. ఆదివారం ఉదయాన్నే కొత్త ఆశలు, ఆలోచనలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
మహిళలు తమ వాకిళ్లను ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం, రేజింతల్ సిద్ధివినాయక, బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయాలు, మెదక్ చర్చిలకు భక్తులు పోటెత్తారు. సంవత్సరమంతా మంచి జరగాలని మొక్కుకున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, మెస్సేజ్లు పంపి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్,జనవరి 1 : ఉమ్మడి మెదక్ జిల్లా నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. 2022కు వీడ్కోలు పలికి కోటి ఆశలతో 2023 ఆహ్వానం పలికారు. పలుచోట్ల శనివారం అర్ధరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇండ్ల ముగింట రంగవల్లులు వేశారు. ఆదివారం ఇష్ట దైవాలను దర్శనం చేసుకుని స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలిపారు.
రామచంద్రాపురం : తెల్లాపూర్ న్యూలైఫ్ చర్చిలో న్యూఇయర్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, పక్కన చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి