చేగుంట, డిసెంబర్ 4 : హైదరాబాద్లోని బోయినిపల్లి లో నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నార్సింగికి చెందిన కాజిపల్లి మల్లేశ్యాదవ్ కుమారుడు చం దుయాదవ్ బోయినిపల్లిలో అయ్యప్ప పడిపూజ నిర్వహిం చారు. అనంతరం అయ్యప్ప స్వామి రథోత్సవంలో ఎంపీ పాల్గొన్నారు. భక్తితోనే శాంతిమార్గం ఏర్పడుతుందని ఎంపీ ప్రభాకర్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బోయినిపల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్, నార్సింగి జడ్పీటీసీ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ చేగుంట మండలాధ్యక్షుడు మైలరాం బాబు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని ఆయ్యప్ప ఆలయంలో హరిదాస్, రాజు గురుస్వామి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది జీవన్రావు ఆయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. మహాపడి పూజ ల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతితోపాటు అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
– హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రం పాపన్నపేటలోని అయ్యప్ప ఆలయ తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పూజలో పాల్గొన్నారు. జెండా కృష్ణ గురుస్వామి, సంగమేశ్వ ర గురుస్వామి మహాపడిపూజ నిర్వహించారు. ఉమ్మడి మె దక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. అనంతరం గడీల శేషు శేనారెడ్డి భక్తులకు అన్నదనం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు, సర్పంచ్ గురుమూర్తిగౌడ్, సభ్యులు సుంకరి కృష్ణ, సుంకరి సాయిలు, సత్యాగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టేక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి గ్రామానికి చెందిన మహేశ్రెడ్డి అయ్యప్ప ఆలయాభివృద్ధికి రూ.11116 విరాళం అందజేశారు.
మండలంలోని జగరాల గ్రామంలో మల్లన్నస్వామి జాతరలో అందోల్ ఎమెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. బండ్ల ఊరేగింపులో భాగంగా వివిధ సం ఘాల తరపున ఎడ్లబండ్లను ఊరేగించారు. ఎమ్మ్యెల్యే చంటి క్రాంతికిరణ్ సైతం ఎడ్ల బండిని నడిపి ఆకట్టుకున్నారు.