మెదక్ అర్బన్/ మెదక్ రూరల్/ పాపన్నపేట/ రామాయంపేట/ రామాయంపేటరూరల్/ చేగుంట/ నిజాంపేట/ కొల్చా రం/ చిలిపిచెడ్/ తూప్రాన్, సెప్టెంబర్ 24 : మెదక్ పట్టణంలోని శాంతినగర్, వాసవీనగర్ కాలనీల్లో ప్రతిష్ఠించిన వినాయకులను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయా లని సూచించారు. అనంతరం మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జగపతి పాల్గొన్నారు.
మెదక్ మండలంలోని గణనాథులుకు ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మండపంలో హోమాలు, సామూహక కుం కుమార్చ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో వివేకానంద యువజన సంఘం ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. కార్యక్ర మంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిరణ్, వివేకానంద యువజన సంఘం సభ్యులు నిఖిల్, ఆశిష్ నరేశ్, రాకేశ్, తాడేపు వంశీ, ప్రదీప్, భాను తదితరులు పాల్గొన్నారు.
ఝాన్సీలింగాపూర్ ఎడ్లబండిపై ఊరేగింపు
రామాయంపేట పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ వినాయకుడికి భక్తులు 216 రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. అనంతరం మహిళలు దాండియా ఆడారు. ఝాన్సీలింగాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య దంపతు లు వినాయకుడిని ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించారు. దామరచెర్వులో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదానం చేపట్టారు.
భక్తిశ్రద్ధలతో పూజలు, హోమాలు
చేగుంట, నార్సింగి మండలాల్లోని వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు. చేగుంట హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మహిళలు కుంకుమార్చ నిర్వహించారు. కర్నాల్ అన్నదానం ఏర్పాటు చేశారు.
హనుమాన్ ఆలయంలో గణపతి హోమం
నిజాంపేటలోని హనుమాన్ దేవాలయంలో బజరంగ్ సేవా సమితి సభ్యులు గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయణం వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బజరంగ్ సేవా సమితి సభ్యులు ఉన్నారు.
వాడవాడలా నవరాత్రి ఉత్సవాలు
కొల్చారం మండలవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిష్ఠిం చిన గణనాథులు నిత్య పూజలు అందుకుంటున్నారు. సంగాయిపేట, కొల్చారం వీరభద్ర దేవాలయ, శివాలయ వినాయక మండపాల వద్ద అన్నదానం నిర్వహించారు.
మండపాల వద్ద అన్నదానాలు
చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్, గౌతాపూర్, చండూర్, ఫైజాబాద్ గ్రామాల్లో అన్నదానం నిర్వహించారు.
వినాయకుడి సేవలో ఎఫ్ చైర్మన్
తూప్రాన్ పట్టణంలోని గణనాథులను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ సందర్శించి, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణగుప్త్తా, నీల ప్రవీణ్ కమ్మరి శ్రీధర్, ప్రభాకర్ చంద నారాయణగుప్త్తా, తుమ్మెట శ్రీనివాస్, పట్లోరి లక్ష్మణ్ ఉన్నారు.