రామాయంపేట, ఫిబ్రవరి 10: పేదింటి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ కానుకలుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, దళితులకు దళితబంధును ఇచ్చి నిరుపేదల గుండెల్లో నిలిచిపోయారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం రామాయంపేట నాల్గో వార్డులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతుబీమా, మిషన్ భగీరథ తదితర పథకాలను ప్రవేశ పెట్టాలనే ఆలోచనతో ఉందన్నారు. గతంలో రాష్ట్రంలో తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా లేకపోయేవి. భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి నేడు ఇంటింటికీ నల్లాల ద్వారా నీరందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలాలు ఉన్న వారికి వారింటివద్దనే ఇళ్లు కట్టుకునేలా సీఎం నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు. మార్చిలో అర్హులైన వారికి డబుల్బెడ్రూంలను ఇస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, చింతల రాధాభవాని, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్రెడ్డి, మర్కు దత్తు, శ్రీనివాస్, దేవుని రాజు, మెట్టు యాదగిరి, చింతల యాదగిరి ఉన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మికతలోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మిర్జాపల్లిలో నిర్మించిన రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తామన్నా రు. మెదక్ నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ. 10కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రమణ, మాజీ ఎంపీపీలు కృపావతి, అరుణ, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి మల్లేశం, సర్పంచ్ దయానంద్, నాయకులు ప్రభాకర్ శ్రీనివాస్, రాములు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంపూర్ణ పారిశుధ్యం కోసం కృషి చేయాలి
సంపూర్ణ పారిశుధ్యం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. మండల పరిధిలోని కామారంలో ఆమె చెత్త బుట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పూలపల్లి యాదగిరియాదవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.