రామాయంపేట, ఫిబ్రవరి 7 : సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. సోమవా రం రామాయంపేటలో మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ఆలయ పరిసరాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, అందులోను పురాతన గుట్టను తవ్వి యాదవులు మల్లన్న స్వామిని ప్రతిష్ఠించడం చెప్పుకోదగిన విషయమన్నారు. ఈ ప్రాంతంలో మల్లన్నస్వామితో పాటు రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ ఇతర కుల సంఘాలకు చెందిన దేవాలయాలు ఉండడం సంతోషాన్నిస్తుందన్నారు. ఆలయ పరిసరాల్లో హరితహారం మొక్కలను నాటాలన్నారు. జూన్ వరకు పూలు, పండ్ల మొక్కలను నాటాలని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తానన్నారు. దేవాలయాలకు తనవంతు సాయంగా అందరి ఆమోదయోగ్యంతో ఆర్థిక సాయం చేస్తానన్నారు. ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రాజు యాదవ్ ఎమ్మెల్సీని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, సర్పంచ్ శివప్రసాదరావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుట్టి అక్షయ్కుమార్, రవితేజ, సురేశ్, యాదవ సంఘం చైర్మన్ బసన్నపల్లి రాజు యాదవ్, మల్లేశం, ఊడెం దేవరాజు, రాములు, రాజు ఉన్నారు.
నిరుపేదలకు అండగా ప్రభుత్వం
నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అర్హత గల వారికి సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి , ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం చల్మెడలో గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యం నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం ప్రారంభోత్సవ వేర్వేరుగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ప్రవేశపెట్టారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానం ఉందన్నారు. నిజాంపేట మండలానికి 19 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడికి ఎమ్మెల్యే పరామర్శ
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాతృమూర్తి లచ్చ వ్వ మృతి చెందింది. పద్మాదేవేందర్రెడ్డి నస్కల్ గ్రా వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించి సం వక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, చల్మెడ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ బాల్రెడ్డి, ఉససర్పంచ్ రమేశ్, తిరుమల ఆల కమిటీ చైర్మన్ మహేశ్, నిజాంపేట, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్లు బాపురెడ్డి, కొండల్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, రవీందర్, మండల కో-ఆప్షన్ గౌస్, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్రావు దయాకర్, వెంకట్, ఎల్లం ఉన్నారు.