టేక్మాల్, సెప్టెంబర్ 1 : అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాలతో మండలంలోని వివిధ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. టేక్మాల్ గ్రామంలో గాంధీ భవన్లో లబ్ధిదారులకు సర్పంచ్ సుప్రజాభాస్కర్ ఆధ్వర్యంలో ఎంపీపీ చింత స్వప్నారవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భక్తుల వీరప్ప పింఛను మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇచ్చిన హామీ మేరకు అర్హు లైనవారికి ఆసరా పింఛన్లు మంజూరు చేసి, ఆదుకుంటున్నా రని తెలిపారు. 57 ఏండ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతోపాటు వితంతువులకు పింఛన్లు మంజూరు చేసినట్లు వివరించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదప్రజలకు కొడుకుగా మహిళలకు అన్నగా మారి, ఆర్థికంగా ఆదుకోవడానికి పింఛన్లు మంజూరు చేశారన్నారు. టేక్మాల్ మండలకేంద్రంలో మొత్తం 146 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. సీఎం కేసీఆర్ తమ ఇంటికి పెద్దదిక్కు అని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కార్యక్రమంలో నాయకులు సలీం, కమ్మరి సిద్ధ్దయ్య, పట్నం రాములు, మాణిక్యం, సుధాకర్, గోవింద్చారి, సత్యం, కిశోర్, రాము, సలావుద్ద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కుసంగి గ్రామంలో 52మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు యూసూఫ్, సర్పంచ్ అబేదాబేగం, ఉప సర్పంచ్ ప్రమీల, ఎంపీటీసీ లచ్చమ్మ పాల్గొన్నారు.
తంప్లూర్ గ్రామంలో మొత్తం 47 మంది లబ్ధ్దిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగన్న, టీఆర్ఎస్ నాయకులు బస్వంత్రావు, మల్లేశం, లక్ష్మణ్, కలీల్, అన్వర్, రాజయ్య, సాయిలు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం : ఎంపీవో గిరిజారాణి
మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో పింఛన్ పత్రాలను సర్పంచ్ భూమగారి నర్సాగౌడ్, ఎంపీవో గిరిజారాణి అందజేశారు. గ్రామంలో మొత్తం 710 మందికి ఆసరా పింఛన్లను అందజేశారు. ప్రతి గ్రామం లో అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని ఎంపీవో తెలిపారు. గ్రామంలో మిగిలినవారికి త్వరలోనే పింఛన్ పత్రాలు ఇస్తామ న్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, కార్యదర్శి మ హేందర్, ఉప సర్పంచ్ సత్తమ్మ, వార్డు సభ్యులు ఉన్నారు.