చేగుంట, ఫిబ్రవరి 7: ఐకమత్యంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. జప్తిశివునూర్లో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం విగ్రహ ప్రతిష్ఠ, పెద్దమ్మ కల్యాణం, హో మం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ముదిరాజ్ భక్తులు ఇంటింటా బోనాలు తీసి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఐకమత్యంగా ఉండి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని, ఆలయ అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ ఆథ్యాత్మిక కార్యక్రమాలను వేదపండితులు సాయికుమార్ శర్మ, అనిల్శర్మ, రవిచంద్రశర్మ, రాఘవశర్మ, హరీశ్శర్మ, నరసింహశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీ చిందం స బిత, సర్పంచ్ షేక్ షరీఫ్, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, గ్రామ ముదిరాజ్ సంఘం కమిటీ అధ్యక్షుడు పరశురాములు, ఉపాధ్యక్షుడు వెంకటేశం, ముదిరాజ్ సంఘం నాయకులు రాములు, పోచయ్య, ఎల్లం, భూదయ్య, చిక్కుడు నర్సింహులు, సంతోష్, రాములు, కృష్ణ, బాగులు, నర్సయ్య, స్వామి, బాలమలయ్య, ఆంజనేయులుతోపాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు.
కొయ్యగుట్ట మల్లన్న ఆలయంలో వైభవంగా బోనాలు
మంబోజిపల్లి శివారులో కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కళ కళ లాడింది. సోమవారం మల్లన్నస్వామి జాతర రెండో రోజు పూజారి మల్లన్న ఆధ్వర్యంలో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారికి మహిళలు బోనాలు సమర్పించా రు. ఒగ్గు కళాకారుల నృత్యాలు అందరినీ అలరింపజేశాయి. భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పూజల్లో ఆలయ అర్చకులు మల్లన్న స్వామి, ప్రజాపతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.