నర్సాపూర్/ మనోహరాబాద్/ కౌడిపల్లి/ రేగోడ్/ మెదక్ అర్బన్/ కొల్చారం/ చిలిపిచెడ్/ రామాయంపేట, ఆగస్టు 19 : వృద్ధ్దులకు సేవలందిస్తున్న వృద్ధ్దాశ్రమాల సేవలను మరవలేమని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్వాంతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో డాంగోరియా చారిటబుల్ ట్రస్ట్లో వృద్ధ్దులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం నర్సాపూర్లోని విజన్ ఓల్డ్ఏజ్ హోంలో మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో వృద్ధ్దులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని, మా నవ సేవే మాధవ సేవగా గుర్తించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విజన్ ఓల్డేజ్ హోంకు స్థలం కావాలని ప్రతినిధి అభర్ణ కోరగా, అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, సీడీపీవో హేమభార్గవి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్ పాల్గొన్నారు.
‘కస్తూర్బా’ విద్యార్థులకు పండ్ల్లు పంపిణీ
మనోహరాబాద్ మండలం కూచారం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ హాజరై విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఐకేపీ ఏపీఎం పెంటాగౌడ్, నాయకులు నాగరాజు, రమేశ్, ఏపీవో ఆదినారాయణ పాల్గొన్నారు.
వృద్ధులకు సేవ.. మహాభాగ్యం : చైర్పర్సన్ సునీతారెడ్డి
వృద్ధులకు సేవ చేయడం మహాభాగ్యంగా భావించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కౌడిపల్లి మండలం తునికి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్లోని ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవిత, సీడీపీవో హేమభార్గవి, సూపర్వైజర్ శశికళ, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, నాయకులు రామాగౌడ్, ఎల్లం, సాయాగౌడ్, కొండల్రెడ్డి, చంద్రశేఖర్ గుప్తా, సాయి పాల్గొన్నారు.రేగోడ్లోని ప్రభుత్వ దవాఖానలో సర్పంచ్ నర్సింహులు, రమేశ్, తుకారాం నాయక్, ఎంపీటీసీ నర్సింహులు, ఎస్సై సత్యనారాయణ, ఎంపీవో శరత్ పండ్ల పంపిణీ చేశారు.
మెదక్ సబ్జైలులోని ఖైదీలకు జైలు సూపరింటెండెంట్ సు ధాకర్, గ్రోస్ సంస్థ అధ్యక్షుడు జాయ్ ముర్రె, సెక్రటరీ ఆనంద్ పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కొల్చారం పీహెచ్సీలో సర్పంచ్ ఉమారాజాగౌడ్ పండ్లు పంపిణీ చేశారు. చిలిపిచెడ్ మండలం చిట్కుల్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ వినోద, ఎంపీడీవో శశిప్రభ, సర్పంచ్ గోపాల్రెడ్డి, ఎంపీటీసీ సుభాష్రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. రామాయంపేటలో జరిగిన కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్, సీడీపీవో స్వరూప, ఎస్సై రాజేశ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ పాల్గొన్నారు.