తూప్రాన్, ఆగస్టు18: గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్లను బెదిరించి, అందినకాడికి దండుకుని వారిపై కత్తులతో దాడి చేసి పరారైన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలోని బైపాస్ వద్ద గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బుధవారం అర్ధ రాత్రి తూప్రాన్లోని కింది వాడకట్టు వద్ద బైక్పై అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. ఆ కాలనీ యువకులు వారిని వెంబడించారు. దీంతో తూప్రాన్ మున్సిపాలిటీలోని పోతరాజ్పల్లి వైపు పారిపోయారు. దుండగుల బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది.
ఆ బైకును అక్కడే వదిలేసిన వారు పోతరాజ్పల్లి వద్ద మరో బైక్ను చోరీ చేసి, 44వ జాతీయ రహదారిపై గల టోల్ప్లాజా వైపు వెళ్లారు. అక్కడ ఓ లారీ డ్రైవర్ను బెదిరించి వారి దగ్గర నుంచి రెండు సెల్ఫోన్లు లాక్కుని, కరీంగూడ వైపు పారిపోయారు. కరీంగూడ బైపాస్లోని ఓ దాబా వద్ద భోజనాల కోసం ఆపిన లారీల్లో దొంగతనానికి ప్రయత్నించారు. ఇది గమనించిన లారీ డ్రైవర్లు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
లారీడ్రైవర్లపై కత్తులతో దా డిచేసి, చోరీ చేసిన ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి, అక్కడ నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించారు. గాయపడిన ముగ్గురు లారీ డ్రైవర్లు నోమాన్ఖాన్, అజారుద్దీన్, అమీర్ ఖాన్ను చికి త్స కోసం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించా రు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై సురేశ్కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.