పటాన్చెరు, ఆగస్టు14: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకుసాగుతున్న నేపథ్యంలో ఆయన నాయకత్వంలో పని చేయడానికి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో 250 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారన్నారు.
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిపారన్నారు. తెలంగాణలో బీజేపీ పాల్పడుతున్న మతతత్వ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడుతారన్నారు. అంతకుముందు పటాన్చెరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్, ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, యాదగిరి యాదవ్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.