నర్సాపూర్, ఆగస్టు 10 : మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు నర్సాపూర్లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నర్సాపూర్లోని అర్బన్ పార్కులో ఎమ్మెల్యే మదన్రెడ్డి, సీసీఎఫ్ మెదక్ శరవనణ్, డీఎఫ్వో రవిప్రసాద్, నర్సాపూర్ రేంజ్ ఆఫీసర్ అంబర్సింగ్ తదితరులు అటవీ సిబ్బందితో పాటు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. మొక్కల పెంపకం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అన్నారు. వాతావరణం కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలను నాటి, పరిరక్షించాలన్నారు. నర్సాపూర్లోని అర్బన్ పార్కులో చక్కటి వాతావరణం ఉందని, ఈ మేరకు పార్కులో సుమారు 750 మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. అర్బన్ పార్కు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతుందన్నారు. అర్బన్ పార్కును అందం గా తీర్చిదిద్దిన అటవీశాఖ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో నర్సాపూర్ సీఐ షేక్లాల్మాదర్, ఎస్సై గంగరాజు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భోగ శేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, కౌన్సిలర్ రామచందర్, యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకట్రెడ్డి, నగేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఊరూరా వనమహోత్సవం
మనోహరాబాద్, ఆగస్టు 10 : మండలంలో వనమహోత్సవంలో భాగంగా ఊరూరా మొక్కలను నాటారు. కూచారం గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్ కుమార్, పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, ఎంపీపీ నవనీతా రవి, తూప్రాన్ సీఐ శ్రీధర్, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజుగౌడ్, సర్పంచ్ నరేందర్రెడ్డి, ఎంపీటీసీ స్వర్ణలతావెంకటేశ్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన సీనియర్ సివిల్ జడ్జి
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 10 : సిద్దార్థ్ పాఠశాలలో వనమహోత్సవానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సిద్దార్థ్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి, ప్రిన్సిపాల్ సంధ్యారాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రీడమ్ పార్కుల ఏర్పాటు : అదనపు కలెక్టర్
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్ట్టు 10 : ప్వాతంత్య్ర వజ్రోత్సవాలల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జిల్లా కేంద్రం లోని 6, 18 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో కలిసి పర్యటించారు. వజ్రోత్సవాల్లో భాగంగా 75 మొక్కలను నాటి, సంరక్షించాలని, వార్డుల్లో ప్రీడమ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఆదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీ సైదులు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు వనజ, లలిత ఉన్నారు.
వజ్రోత్సవాలపై ‘గడా’ ప్రత్యేకాధికారి సమీక్ష
తూప్రాన్, ఆగస్టు 10 : మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మెన్ రాఘవేందర్గౌడ్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, అధికార్లు, కౌ న్సిలర్లతో ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం 7 గంటలకు తూ ప్రాన్ పోలీస్స్టేషన్ నుంచి పోతరాజ్పల్లి వరకు 2కే రన్ ఉం టుందని, పట్టణ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, తహసీల్దార్ ఆనంద్బాబు, ఎస్సై సురేశ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.