మెదక్ మున్సిపాలిటీ/చిన్నశంకరంపేట/ కొల్చారం/పెద్దశంకరంపేట/రామాయంపేట, జనవరి 23: రామాయంపేట పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఫ్రెండ్స్ అసోషియేషన్ అధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, మండలాధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహనీయుడు నేతాజీ అని కొనియాడారు. పెద్దశంకరంపేటలో ఆర్వీఏస్ స్వచ్ఛంద సంస,్థ ఆర్ఎస్ఎస్, శిశుమందిరం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గాంధీచౌరస్తా వద్ద ఉన్న సుభాష్చంద్రబోస్ విగ్రహనికి నివాళులర్పించారు ఎంపీపీ జంగం శ్రీనివాస్,సర్పంచ్ సత్యనారాయణ,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీటీసీలు వీణా సుభాశ్గౌడ్, అనితా విఠల్, స్వప్న రాజేశ్వర్, ఆర్వీఏస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షుడు గంగారెడ్డి, ప్రధానాచార్యుడు వీరప్ప ఉన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట లో హనుమాన్సేవా సమితి యువజన సంఘం ఆధ్వర్యంలో సుభాష్చంద్రబోస్ జయంతి నిర్వహించారు. హనుమాన్సేవాసమితి అధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్, సంఘం సభ్యులు కుమ్మరి నరేశ్,ప్రేమ్కుమార్, తాప్పటి సాయి,ఉప్పలరామ్ నరేశ్, పెంటస్వామి, తాటికొండ గణేశ్ గూడూరిప్రణయ్, గరిగే విజయ్కుమార్రెడ్డి, బోయిన శ్రీకాంత్, బెస్తదత్తు, యువజన సంఘాల సమితి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నాయిని ప్రవీణ్కుమార్ పాల్గొని నివాళులర్పించారు.
ఎస్టీయూ ఆధ్వర్యంలో
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్టీ యూ భవన్లో నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్గౌడ్, నాయకులు సిద్ధ్దిరాములు, వేణుగోపాల్ ఎల్లం, జబ్బార్ నేతాజీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. మాతృదేశ స్వాతంత్య్ర సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానేత నేతా జీ అని సామాజిక సమరసత వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ మశ్చేంద్రనాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సమరసత వేదిక ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. కొల్చారం మండ లం పోతంశెట్పల్లి చౌరస్తాలో నేతాజీ విగ్రహానికి పలువురు యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.