పటాన్చెరు టౌన్/ పటాన్చెరు, జూలై 25: పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివాం ఆషాఢమాస బోనాలను పటాన్చెరులో ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని ఏడుగుళ్ల పోచమ్మ దేవాలయం వద్ద బోనాలతో మహిళలు సందడి చేశా యి. పట్టణంలోని అన్ని కాలనీలు, బస్తీల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు.
దేవాలయ ప్రాంగణం బోనాలతో కిటకిటలాడింది. పట్టణ నడిబొడ్డున ఉన్న మహంకాళి మందిరం నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై, పలు వీధుల మీదుగా దేవాలయం వరకు వెళ్లారు. అమ్మవారి ఫలారం బండిని ఊరేగింపుగా ఏడుగుళ్ల పోచమ్మ దేవాలయానికి తీసుకెళ్లారు. తొట్టెలు సమర్పించారు. ముదిరాజ్ బస్తీలోని పోచమ్మ దేవాయం, జేపీ కాలనీ పోచమ్మ గుడి వద్ద భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. గోనమ్మ బస్తీలో గోనమ్మ దేవాలయం లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ ఆధ్వర్యంలో వారి నివాసం నుంచి బోనాలు తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరుపై అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అమ్మవారి దీవెన, ప్రజల సహకారం తో ఎనిమిదేండ్ల నుంచి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నానన్నారు. నిరంతరం ప్రజా సేవలో ఉన్నవారికి పోచమ్మతల్లి దీవెనలు ఉంటాయన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందే లా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సత్య నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, యాదగిరి యాదవ్, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తనయుడు
గుమ్మడిదల, జూలై25: ఆషాఢమాస బోనాల పండుగలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తనయుడు విక్రమ్రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని బొంతపల్లి, దోమడుగు తదితర గ్రామాల్లో నిర్వహించిన బోనాలకు విక్రమ్రెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చి ట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పలు గ్రామాల్లో నిర్వహించి పోచమ్మ తల్లి బోనాలకు హాజరై ప్రత్యేక పూ జలు చేశారు. పోతరాజులు, శివసత్తుల పూనకాలతో బోనాలు నిర్వహించారు. సర్పంచ్ ఆలేటి నవీనా శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ పాలకులు పాల్గొన్నారు.