సిద్దిపేట, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని వివిధ రహదారుల బీటీ రెన్యువల్, మరమ్మతులకు గాను ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులను మంజూరు చేయించారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లోని రోడ్ల బీటీ రెన్యువల్, మరమ్మతులకు మొత్తం 98 పనులకు రూ.8175.92 లక్షలను ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) మంజూరయ్యాయి. సిద్దిపేట నియోజకవర్గంలో 34 పనులకు రూ. 1789.28 లక్షలు, గజ్వేల్ నియోజకవర్గంలో 8 పనులకు రూ. 786.28 లక్షలు, దుబ్బాక నియోజకవర్గంలో 32 పనులకు రూ. 34.60కోట్లు, హుస్నాబాద్ నియోజకవర్గంలో 14 పనులకు రూ.1161లక్షలు, జనగామ నియోజకవర్గంలో 8 పనులకు రూ. 8.09కోట్లు, మానకొండూరు నియోజకవర్గంలో 2 పనులకు రూ.1.70కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులను ప్రారంభించి పూర్తి చేయనున్నారు.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
జిల్లాలోని వివిధ రహదారుల బీటీ రోడ్లు రెన్యువల్, మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లోని 98 రోడ్డు పనులకు రూ. 8175. 92 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా మండలాల్లో రోడ్ల బీటీ రెన్యువల్ చేయడంతో పాటు రోడ్డు మరమ్మతులు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని గ్రామాలకు రహదారులు వేస్తున్నది. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చుతున్నది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
– తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
సిద్దిపేట నియోజకవర్గం..
సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను కలుపుతూ ఉన్న 34 రహదారుల మరమ్మతులకు రూ.1789.25 లక్షలను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నకోడూరు మండలం జక్కాపూర్-విఠలాపూర్ రోడ్డుకు రూ.69.90 లక్షలు, చంద్లాపూర్-మిద్దెలవాడ రోడ్లుకు రూ.53.50 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు ఖమ్మర్లపల్లి-గాడిచర్లపల్లి వయా కొండెంగల గుట్ట రోడ్డుకు గాను రూ.44.50 లక్షలు, ఎల్లాయిపల్లి-విఠలాపూర్ వరకు రూ.1.13కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు ఇబ్రహీంపూర్-మేడిపల్లి వయా రామన్నపల్లి రోడ్డుకు గాను రూ. 53.50 లక్షలు, చౌడారం నుంచి ఇబ్రహీంనగర్ రోడ్డుకు రూ.70.20 లక్షలు, సికింద్లాపూర్-కస్తూరిపల్లి రోడ్డుకు రూ.36.30 లక్షలు, జడ్పీరోడ్డు-ఎల్లాయిపల్లికి రూ. 27.50 లక్షలు మంజూరయ్యాయి. నంగునూరు మండలం పీడబ్ల్యూడీ రోడ్డు-తిమ్మాయిపల్లి వయా కోనాయిపల్లి, భాషగూడెం రోడ్డుకు రూ.121.50లక్షలు, నర్మెట్ట-పాలమాకుల వయా అప్పలాయ చెరువుకు రూ.95.50 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు-జేపీతాండ రూ. 20.50 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు-అంక్షాపూర్ వయా మగ్ధూంపూర్ రోడ్డుకు రూ.78లక్షలు, గట్లమల్యాల బైపాస్ రోడ్డుకు రూ.13.30లక్షలు, మైసంపల్లి-ఖానాపూర్ రోడ్డుకు రూ.87లక్షలు, బైపాస్ రోడ్డు ఎస్సీ లోకాల్టి తిమ్మాయిపల్లి రూ.14లక్షలు, జడ్పీరోడ్డు మైసంపల్లి రూ. 44.50 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు కరీంనగర్ జిల్లా బార్డర్ వయా అక్కెనపల్లి రూ.37లక్షలు. సిద్దిపేట రూరల్ మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు వయా పెద్దలింగారెడ్డిపల్లి రూ. 24లక్షలు, చిన్నగుండవెల్లి-రావురూకుల రూ.18 లక్షలు, రాఘవాపూర్-హసన్ మీరాపూర్ రోడ్డుకు రూ.56లక్షలు, మాచాపూర్-ముస్తాబాద్ రోడ్డు వయా పిట్టలవాడ రూ.19లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి అంకంపేట వయా బచ్చాయిపల్లి రూ.30.50 లక్షలు, లక్ష్మీదేవిపల్లి-కోదండరావుపల్లి రోడ్డుకు రూ.22.30 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు-రావురూకులకు రూ.14.70 లక్షలు, సిద్దిపేట అర్బన్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు-రాజీవ్ రహదారి వయా కాళ్లకుంట పొన్నాల రూ.50.50 లక్షలు, నర్సాపూర్-మిట్టపల్లి నుంచి మందపల్లి ఎక్స్ రోడ్డు వరకు రూ.65.50 లక్షలు, తడ్కపల్లి ఎస్సీ కాలనీ నుంచి వెంకటాపూర్ పీఆర్ రోడ్డుకు రూ.26 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు-బూరుగుపల్లి వరకు రూ.18 లక్షలు, వెల్కటూరు-ముండ్రాయి వరకు రూ.45 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు-పుల్లూరుకు రూ.2.15కోట్లు మంజూరయ్యాయి.
గజ్వేల్ నియోజకవర్గం..
గజ్వేల్ నియోజకవర్గంలోని ఎనిమిది రహదారుల రెన్యువల్కు రూ.786.28 లక్షలు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని గజ్వేల్ మండలంలోని దౌల్తాబాద్ పీడబ్ల్యూడీ రోడ్డు-లింగారెడ్డి నుంచి బయ్యారం రోడ్డుకు రూ.80.40 లక్షలు, జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ ఎస్సీకాలనీ-బస్వాపూర్ రోడ్డుకు రూ.87.50 లక్షలు, కొండపాక మండలం పీడబ్ల్యూడీ రోడ్డు ఎన్సాన్పల్లి-మర్పడగ వయా ఖమ్మర్లపల్లి రోడ్డుకు రూ.194.38 లక్షలు, మర్కూక్ మండలంలోని అంగడికిష్టాపూర్-నర్సన్నపేట రోడ్డుకు రూ.38 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు గౌరారం-కేశిరెడ్డిపల్లి వయా మామిడ్యాల, దామరకుంట, డబుల్ రోడ్డు దామరకుంట, కేశిరెడ్డిపల్లి రూ.1.05 కోట్లు, ములుగు మండలంలో బ్యాలెన్స్ రీచ్ మర్కూక్-నారాయణపూర్ రోడ్డుకు రూ.1.07కోట్లు, వర్గల్ మండలం గౌరారం-కేశిరెడ్డిపల్లి వయా తానేదారుపల్లి, మామిడ్యాల, దామరకుంట రోడ్డుకు రూ. 62 లక్షలు, బ్యాలెన్స్ రీచ్ అంగడికిష్టాపూర్-ఇప్పలగూడ రోడ్డుకు రూ.1.12కోట్లు మంజూరయ్యాయి.
దుబ్బాక నియోజకవర్గం..
దుబ్బాక నియోజకవర్గంలో 32 పనులకు గాను రూ. 3460.36 లక్షలు మంజూరయ్యాయి. దుబ్బాక-చిన్న చీకోడు రోడ్డుకు రూ.82 లక్షలు, లచ్చపేట పీడబ్ల్యూడీ రోడ్డు- కామారెడ్డి బార్డర్ రోడ్డుకు రూ.1.79 కోట్లు, దుబ్బాక-అచ్చముయిపల్లి రోడ్డుకు రూ.53 లక్షలు, దుబ్బాక-మల్లాయిపల్లి రోడ్డుకు రూ.36 లక్షలు, రామక్కపేట, ధర్మాజీపేట – మెదక్ పీడబ్ల్యూడీ రోడ్డుకు రూ1.26 కోట్లు, పోతారెడ్డిపేట -కల్వకుంట, తాళ్లపల్లి రోడ్డుకు రూ.56 లక్షలు, దుబ్బాక బస్డిపో-ధర్మాజీపేట రోడ్డుకు రూ.62 లక్షలు మంజూరు చేశారు. తొగుట మండలం వెంకట్రావుపేట-సూరంపల్లి రోడ్డుకు రూ.4.63 కోట్లు, ఎల్లారెడ్డిపేట-బండారుపల్లి, తడకపల్లి రోడ్డుకు రూ.2.42 కోట్లు, తుక్కాపూర్ సబ్ స్టేషన్- ఘనపూర్ రోడ్డుకు రూ. 94.20 లక్షలు, వాగు గడ్డ- జప్తిలింగారెడ్డిపల్లి రోడ్డుకు రూ.22 లక్షలు, వరదరాజ్పల్లి-మర్రికుంట రోడ్డుకు రూ.1.12 కోట్లు, లింగంపేట-తోగుట రోడ్డుకు రూ.1.03 కోట్లు, మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల-మదన్పల్లిరోడ్డుకు రూ.94.20 లక్షలు, జప్తిలింగారెడ్డిపల్లి చౌరస్తా-పెద్ద చెప్యాల రోడ్డుకు రూ.98.60 లక్షలు, మిరుదొడ్డి-అందె రోడ్డుక రూ.89.80 లక్షలు, చిట్టాపూర్-మిరుదొడ్డి (వయా మోతె, కాసులాబాద్)రోడ్డుకు రూ.1.73 కోట్లు, మిరుదొడ్డి పీడబ్ల్యూడీ రోడ్డు-కాసులాబాద్ రోడ్డుకు రూ.53 లక్షలు, దౌల్తాబాద్ మండలం మక్కరాజ్పేట-మహ్మమద్షాపూర్ రోడ్డుకు రూ.1.89 కోట్లు, దౌల్తాబాద్-దీపంపల్లి(వయా గొడుగుపల్లి) రోడ్డుకు రూ.1.13 కోట్లు, ముబారస్పూర్-శౌరీపూర్, మల్లేశంపల్లి రోడ్డుకు రూ.93.80 లక్షలు, దౌల్తాబాద్ పీడబ్ల్యూడీ- ఉప్పరపల్లి రోడ్డుకు రూ.46.20 లక్షలు, రాయపోల్ మండలం కొత్తపల్లి- ఉదయాపూర్(వయా గొల్లపల్లి, టెంకటంపేట) రోడ్డుకు రూ.1.72 కోట్లు, రాయపోల్-అనాజీపూర్ రోడ్డుకు రూ.1.96 కోట్లు, ఉదయపూర్-రాయపోల్ రోడ్డుకు రూ.1.15 కోట్లు, చౌదరిపాలెం-చిన్నమసాన్పల్లి రోడ్డుకు రూ.83 లక్షలు, అంకిరెడ్డిపల్లి-లింగారెడ్డిపల్లి, రాంసాగర్ రోడ్డుకు రూ.44 లక్షలు, ముక్త మసాన్పల్లి-బేగంపేట,బీవీపూర్, ఎల్కల్ రోడ్డుకు రూ.31 లక్షలు, అప్రోచ్రోడ్డు-చౌదరిపాలెం రోడ్డుకు 23.60 లక్షలు, ఆరెపల్లి-రామ్సాగర్, ముంగిసపల్లి రోడ్డుకు రూ.74 లక్షలు, తిమ్మక్కపల్లి-లింగాపూర్ రోడ్డుకు రూ.కోటి, చేగుంట మండలం మక్కరాజుపేట- దౌల్తాబాద్ వయా గొల్లపల్లి రోడ్డుకు రూ. 38.65 లక్షలు, జడ్పీ రోడ్డు-పెద్దశివనూరు రోడ్డుకు రూ.16.20 లక్షలు, పెద్ద శివనూరు-చిన్న శివనూరు రోడ్డుకు రూ.51.86 లక్షలు, పీడబ్యూడీ రోడ్డు-చిన్న శివనూరు రోడ్డుకు రూ.45.20 లక్షలు, చందాయిపేటమసాయిపేట రోడ్డుకు రూ.1.20 కోట్లు, పోతాన్పల్లి-జెల్లగుంట తండా రోడ్డుకు రూ.39 లక్షలు, నార్సింగ్ మండలంలో నేషనల్ హైవే 7(ఎన్హెచ్ 7)-చిత్రోజుపల్లి రోడ్డకు రూ.1.13 కోట్లు, ఎన్హెచ్ 7 – బిమ్రావ్పల్లి రోడ్డుకు రూ.31 లక్షలు మంజూరయ్యాయి.
హుస్నాబాద్ నియోజకవర్గం..
హుస్నాబాద్ నియోజకవర్గంలోని 14 బీటీ రెన్యువల్కు ఎస్డీఎఫ్ ద్వారా రూ. 11.61కోట్లు మంజూరయ్యాయి. అక్కన్నపేట మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు ధర్మారం-నందారం, పోతారం(జే) రోడ్డుకు రూ.90లక్షలు, గండిపల్లి-రామవరం రోడ్డుకు రూ.66లక్షలు, నందారం-మాసిరెడ్డితాండ, వయా కపూర్నాయక్ తండా, దుద్యేతండా, పూసాయితండా, బాల్నాయక్ తండా రోడ్డుకు రూ.70 లక్షలు, మల్లంపల్లి-ధర్మారం వయా టేకులతండా రూ.74లక్షలు, పోతారం(జే)-ధర్మారం ఎక్స్ రోడ్డు వయా తుర్కోనికుంట, రాఘటివానిపల్లి రూ.82లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు-కట్కూర్ ఎక్స్ రోడ్డు వయా మిర్జాపూర్, మల్లంపల్లి, మోత్కులపల్లి రోడ్డుకు రూ. 1.64కోట్లు, అక్కన్నపేట-గండిపల్లి వయా కేశ్నాయక్తండా రోడ్డుకు రూ. 1.40కోట్లు, హుస్నాబాద్ మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు-మైసంపల్లి వయా బంజేరుపల్లి రోడ్డుకు రూ. 20లక్షలు, పందిల్ల-పర్వేదకు రూ.60లక్షలు, జడ్పీ రోడ్డు-బాలూనాయక్ తండా రోడ్డుకు రూ.35లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు ఎక్స్ రోడ్డు కట్కూర్ వయా మిర్జాపూర్, మల్లంపల్లి, మోత్కుపల్లి రోడ్డుకు రూ.90లక్షలు, కోహెడ మండలంలో పర్వేద-కోహెడ రోడ్డుకు రూ. 44లక్షలు, పర్వేద-నకిరేకొమ్ముల ఆర్అండ్బీ రోడ్డు రూ.36లక్షలు, కోహెడ -మైసంపల్లి వయా చెంచేరుపల్లి నుంచి శేర్అలీనగర్, కచాపూర్కు 1.90కోట్లు మంజూరు చేశారు.
జనగామ నియోజకవర్గం..
జనగామ నియోజకవర్గంలోని ఎనిమిది రోడ్ల బీటీ రెన్యూవల్కుగాను రూ. 8.09 కోట్లు మంజూరయ్యాయి. మద్దూరు మండలంలో మర్మాముల- మద్దూరు వయా ధర్మారం రోడ్డుకు రూ.కోటి 5లక్షలు, తోర్నాల-బెక్కల్ రోడ్డుకు రూ. 95లక్షలు, చేర్యాల మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు చేర్యాల-పీఆర్ రోడ్డు నర్సాయిపల్లి వయా ఎస్టీవో కార్యాలయం ఆఫీస్(బైపాస్ రోడ్డు)కు రూ.1.18కోట్లు, ఆకునూరు-రాంపూర్కు రూ. 70లక్షలు, చిట్యాల-దానంపల్లికి రూ. 1.08కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు చేర్యాల-దొమ్మాటకు రూ.91లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు ముస్త్యాల-వీరన్నపేటకు రూ. 50లక్షలు, కొమురవెల్లి మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు-కమాన్ వయా కొమురవెల్లి రోడ్డుకు రూ.1.72కోట్లు మంజూరయ్యాయి.
గెలుపోటములతో సంబంధం లేకుండా..దుబ్బాక అభివృద్ధే లక్ష్యం
దుబ్బాక, జూలై 5: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని, గత ఉప ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్ రోడ్లకు భారీగా నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు. మల్లన్నసాగర్ పనులతో భారీ వాహనాల ద్వారా రవాణా జరగడంతో రోడ్లు దెబ్బతిన్నాయని, దీంతో ప్రజలు, వాహన చోదకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, దుబ్బాక నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ రోడ్ల మరమ్మతులకు రూ.40 కోట్లు మంజూరు చేశారరన్నారు.