భవిష్యత్కు బాటలు వేసే కోర్సులు ఇవే.. దేశ ఆర్థిక వ్యవహారాల్లో పర్యవేక్షణ, నియంత్రణకు సీఏ కోర్సు ఎంతో దోహదం చేస్తుంది. ఇంటర్ తర్వా త సీపీటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హత సాధించి ఐపీసీసీలో చేరొచ్చు. నాలుగున్నరేండ్లు శ్రద్ధగా చదివితే సమాజంలో ఉన్నత హోదాలో కొనసాగే అవకాశముంటుంది.
భవిష్యత్కు బాటలు వేసుకునేదిప్పుడేవైద్య వృత్తిపై ఆసక్తి ఉంటే ఎంబీబీఎస్ కోర్సు ఉత్తమం. ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్లో సీటు లభిస్తోంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు సర్కారు దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జరీ మెడికల్ ఆఫీసర్లాంటి ఉద్యోగాలు పొందవచ్చు. సొంతంగా దవాఖాన పెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ సీటు రాకుంటే బీడీఎస్లో చేరవచ్చు.
న్యాయవృత్తి
ఇంటర్ తర్వాత ఐదేండ్లు న్యాయ విద్య కోర్సు ఉంటుంది. లాసెట్తో ప్రవేశాలు జరుగుతాయి. స్థిరపడేందుకు ఎక్కువ సమయం తీసుకున్నా ఉపాధికి ఏ మాత్రం డోకా ఉండదు. న్యాయవాదిగా, వ్యాపార సంస్థల న్యాయ సలహాదారుగా రాణించే అవకాశం ఉంటుంది.
భవిష్యత్కు బాటలు వేసుకునేదిప్పుడేఉపాధ్యాయ వృత్తిపై మక్కువ ఉంటే డీఎడ్ కోర్సులో చేరవచ్చు. డీఎడ్ కామన్ ఎంట్రాన్స్ పరీక్షతో సీటు లభిస్తుంది.
సేవ చేయాలనుకుంటే..
బైపీసీ విద్యార్థులకు బీఎస్సీ నర్సింగ్ మరో చక్కని అవకాశం. ఈ కోర్సుతో స్వయం ఉపాధి పొందడమేగాక రోగులకు సేవ చేసే అవకాశముంటుంది. ఇంటర్ తర్వాత నాలుగేండ్ల కోర్సు ను ఎంపిక చేసుకుంటే ఆపై వెంటనే ఉద్యోగం వస్తుంది. రెండేండ్లు ఫిజియోథెరపి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్..
ఎంసెట్లో ఇంజినీరింగ్ కోర్సులకు ప్రాధా న్యం అధికం. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఐటి, ఈఈఈ లాంటి కోర్సులు ఉన్నాయి. ఆసక్తి ఉంటే ఎందులోనైనా రాణించే అవకాశముంటుంది.
వ్యవసాయం, ఉద్యానవనం
ఎంసెట్తోనే బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ (బైపీసీ విద్యార్థులు)చదివే అవకాశం ఉంది. నాలుగేండ్లు బీఎస్సీ అగ్రికల్చర్, ఆపై పీజీ తర్వాత పరిశోధన వైపు అడుగులు వేసే అవకాశముంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సంప్రదాయ డిగ్రీ
బీఏ అంటే చిన్నచూపు వద్దు.. శ్రద్ధతో చదివితే మంచి అవకాశాలున్నాయి. బీకాం జనరల్, కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంది. బీఎస్సీలో అనేక కాంబినేషన్ కోర్సులున్నాయి. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.
ఐఐటీ సాంకేతిక విద్యలో మేటి
ఇంజినీరింగ్ విద్యపై ఆసక్తి ఉన్నత విద్యా సంస్థల్లో అభ్యసించాలనే వారికి ఐఐటీ ఎంతో ప్రయోజనకరం. విద్యార్థులు వారి అభిరుచికి తగిన కోర్సులను ఎంచుకోవాలి. ఎదో ఒకటి అనుకుంటే పొరపాటే.
ఫార్మసీ ఎంతో ప్రాధాన్యం
ఔషధరంగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఫార్మసీ విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుం ది. అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. ఎంసెట్తోనే బీఫార్మసీ ప్రవేశాలు జరుగుతాయి. ఇది పూర్తి చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ ఆఫీసర్, హాస్పిటల్ ఫార్మసిస్టులుగా ఉద్యోగాలు లభిస్తాయి.
విద్యార్థులు ఇవి గుర్తు పెట్టుకోండి
ప్రతి విద్యార్థికి ఏదో ఒక అభిరుచి ఉంటుంది. ఇప్పుడే దానిని గుర్తించాలి. సామర్థ్యమున్న సబ్జెక్టును ఎంచుకుని అందులో చేరాలి. తల్లిదండ్రులు చెప్పారని, స్నేహితులు తీసుకున్నారని ఏ కోర్సులో పడితే దానిలో చేరొద్దు. మార్కెట్లో డిమాండ్ కన్నా
మనస్సుకు నచ్చిన దానికి ప్రాధాన్యమివ్వాలి. పట్టుదల ఉంటే చదువులో రాణించవచ్చు. ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన ప్రతి 100మందిలో 60మందికి స్కిల్స్ లేవని కంపెనీలు తిరస్కరిస్తుంటాయి. ఆ జాబితాలో మీరు లేకుండా చూసుకోండి.
తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి తప్పా, దిశా నిర్దేశం కాదు. పిల్లలకిష్టమైన కోర్సుల్లో చేరనీయండి. అందులో రాణించేలా ప్రోత్సహించండి. వారిపై ఒత్తిడి తెచ్చి ఇబ్బందులు పెట్టొద్దు.
మీకిష్టమైన కోర్సును ఎంపిక చేసుకోవడమే ఉత్తమం
మునిపల్లి, జూలై 5 : కొద్ది రోజుల క్రితమే ఇంటర్ ఫలితాలు వెలు వడ్డాయి. ఇంటర్ తర్వా త ఏం చదవాలి.. ఏ రంగంలో స్థిర పడాలనే సందేహాలు విద్యార్థుల మెదడును తొలిచేస్తాయి. డాక్టర్, ఇంజినీర్, శాస్త్రవేత్త, చార్టెడ్ అకౌంటెంట్, వివిధ ప్రభుత్వ కొలువులు.. ఇలా ఎన్నో అవకాశాలు ఊరిస్తూ ఉంటాయి. కానీ ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకోకుండా, మీకిష్టమైన కోర్సును ఎంపిక చేసుకుని ముందుకు సాగితేనే భవిష్యత్ భాగుంటుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.