పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 97.85శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలువగా, 96.76శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా 3వ స్థానంలో, 94.44శాతంతో మెదక్ జిల్లా 11వ స్థానంలో నిలిచాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. ఉత్తీర్ణత శాతంలో అబ్బాయిలను వారు మించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేట్ను మించి మంచి ఫలితాలు సాధించాయి. పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఎస్సెస్సీ బోర్డు తెలిపింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జూలై 18వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ప్రకటనలో తెలిపింది. కాగా, సిద్దిపేట, సంగారెడ్డి మంచి స్థానాలు సాధించడంతో ఆ జిల్లాల విద్యాశాఖ అధికారులను మంత్రి హరీశ్రావు అభినందించారు.
మెదక్లో 94.44 శాతం ఉతీర్ణత
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 30: పదో తరగతి ఫలితా ల్లో బాలికల హవా కొనసాగింది. గురువారం విడుదలైన ఫలితాల్లో మెదక్ జిల్లా 94.44శాతం ఉతీర్ణతో రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచింది. గతేడాది కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా అందరినీ ప్రభుత్వం పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 23నుంచి 28వరకు పరీక్షలు జరిగాయి. మెదక్ జిల్లాలో 72పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్, ప్రైవేట్ కలిసి 11, 276మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 10,649 మం ది ఉత్తీర్ణులయ్యారు. ఇందు లో బాలురు 5,622 మందికి 5,192 మంది ఉతీర్ణులు కాగా, 92.35శాతం నమోదైంది. బాలికలు5,654 మందికి 5,457 ఉతీర్ణులు కాగా, 96.52 శాతం ఉతీర్ణత సాధించినట్లు డీఈవో రమేశ్కుమార్ తెలిపారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఆయ న వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థులు జూలై 18వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.
మండలల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం..
రామాయంపేట మండలంలోని గురుకుల పాఠశాలలో ని విద్యార్థులు 99మందికి 99మంది, పట్టణంలోని తెలంగాణ మాడల్ స్కూల్లో 88మంది విద్యార్థులకు గాను 88 మంది ఉత్తీర్ణత సాధించారు. కొల్చారం మండల వ్యాప్తం గా 98శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో నీలకంఠం తెలిపారు. హవేళీఘనపూర్ జ్యోతిరావుపూలె బాలికల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. శివ్వంపేట మండలం పిల్లుట్ల జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సాధించి మండలటాప్ స్కూల్గా నిలిచింది.
చిన్నశంకరంపేట మండలంలో 499మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 463మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పాపన్నపేట మండలంలోని 11ఉన్నత పాఠశాలల నుంచి 664మంది విద్యార్థు లు పరీక్షలకు రాయగా 651మంది విద్యార్థులు పాసవ్వగా ఉత్తీర్ణత 98శాతం నమోదైంది. అల్లాదుర్గం మండలం 99 శాతం ఉత్తీర్ణత సాధించింది. అల్లాదుర్గం బాలుర, చిల్వెర, కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సా ధించారు. చిలిపిచెడ్ మండలంలోని కేజీబీవీ పాఠశాలతో కలిపి ఏడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఏడు పాఠశాలల్లోని 178మంది విద్యార్థులు పరీక్ష రాయగా 170మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
చిలిపిచెడ్ ఉన్నత పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. వెల్దుర్తి మండలంలో 7ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఒక కస్తూర్బా పాఠశాలతో కలిపి మొత్తం ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 479మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 459మంది విద్యార్థులు ఉత్తీర్ణిలయ్యారు. నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు 98.27శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటారు. టేక్మాల్ మండల ప్రభుత్వ పాఠశాలలు 97శాతం ఉతీర్ణత సాధించినట్టు ఎంఈవో ఎస్. నీల కంఠం తెలిపారు. మండలం లో 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. ఏడుగురు విద్యార్థులకు 10/10 వచ్చిందన్నారు.
సత్తాచాటిన సంగారెడ్డి 96.76 శాతం ఉత్తీర్ణత
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 30: పదో తరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు గురువారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 97.85 శాతంతో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 96.75 శాతంతో సంగారెడ్డి జిల్లాకు మూడవ స్థానం లభించింది. జిల్లాలో మొత్తం 22,363 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 21,636 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 11,459 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 11,000మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 95.99 శాతం ఉత్తీర్ణత సాధించారు.
బాలికలు మొత్తం 10,904 మంది పరీక్ష రాయగా, 10,636 మంది ఉత్తీర్ణులై 97.54 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద పది ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించి పైచేయిగా నిలిచారు. పదో తరగతి ఫలితాలను http://bse.telanagana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ తెలిపారు. రాష్ట్రంలో జిల్లాకు మూడవ స్థానం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.
మండలాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
నారాయణఖేడ్ మండలంలోని 19 ఉన్నత పాఠశాలలు ఉండగా 12పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. మొత్తం 1,175మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,140మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మండల విద్యాధికారి విశ్వనాథ్ తెలిపారు. మొత్తం 15మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించచారు. మునిపల్లి మండలంలో 97శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మునిపల్లి ఎమ్ఈవో దశరథ్ తెలిపారు. ఆర్సీపురం మండలంలో 95శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసుకుంది. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9/9విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించగా, నల్లవల్లి జిల్లా పరిషత్లో 23/23 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు హెచ్ఎం పద్మావతి తెలిపారు.
అనంతారంలో 6/6 మంది విద్యార్థులు, గుమ్మడిదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 74/79మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 94శాతంలో నిలిచారు. కానుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 62/63మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 98.4శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అందోల్ మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. మండలంలోని 10 పాఠశాలల్లో 584మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 582మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందినట్లు ఎంఈవో కృష్ణ తెలిపారు. సిర్గాపూర్ మండలంలోని ఎస్టీ బాలికల గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థులు టెన్త్లో 10జీపీఏ సాధించారని ఎంఈ వో శంకర్ తెలిపారు. కంగ్టి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు గిరిజన గురుకుల పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. కస్తుర్బా పాఠశాలకు చెందిన 40మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 40మంది ఉత్తీర్ణత సాధించారు.
నాగల్గిద్ద మండలంలోని కారాముంగి, కరస్గుత్తి, మోర్గి, నాగల్గిద్ద పాఠశాలకు చెందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. హత్నూ ర మండలంలోని మొత్తం 16ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో ఎనిమిది పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. వట్పల్లి మండలంలోని ఐదు జిల్లా పరిషత్ పాఠశాలలు, పోతులబోగుడ మోడల్ స్కూల్లో కలిపి 303మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 300మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో కృష్ణ తెలిపారు. అందులో పోతులబొగుడ మోడల్ స్కూల్లో ఇద్దరు విదార్థులు 10/10 సాధించారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 80మందికి గానూ 80 మంది పాస్ అయ్యారు. కోహీర్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల నుంచి 35మంది పరీక్ష రాయగా 100శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉన్నత పాఠశాల్లో 72మంది బాలికలు, కవేలిలో 19, గొటిగార్పల్లిలో 14మంది ఉత్తీర్ణత సాధించారు.