సంగారెడ్డి, జూన్ 28: జిల్లా ప్రజా పరిషత్లో చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆట్టామాసంగా జరిగాయి. మంగళవారం జిల్లా పరిషత్లోని జడ్పీ చాంబర్లో ఉప కార్యనిర్వహణాధికారి స్వప్న ఆధ్వర్యం లో ఉద్యోగులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి కేక్కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు చైర్ పర్సన్కు కేక్ తినిపిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చైర్పర్సన్ ఆయురారోగ్యాలతో జిల్లా పరిషత్ సేవలు మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఆదారభిమానాలు, ఆశీస్సులు పొందాలని వా రు ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో చైర్పర్సన్ తనయుడు జయంత్రెడ్డి, కోడలు శరణ్, వేణు గోపా ల్, రవీందర్, శ్రీనివాస్రెడ్డి, మురళీ, విజ్ఞాన్, మంజుల, సులక్షణ, సాయికుమార్, బాలకృష్ణ, రవిశంకర్ ఉన్నారు.
నాల్గో తరగతి ఉద్యోగుల ఆధ్వర్యంలో…
పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీకి పుష్పగుచ్చం అందజేసి పుట్టనరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం జడ్పీ చాంబర్లో కలిసి శాలువా కప్పి సన్మానించారు.
జడ్పీ చైర్పర్సన్ కు శుభాకాంక్షలు వెల్లువ
పుల్కల్/చౌటకూర్, జూన్ 28: సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఉమ్మడి మండల టీఆర్ఎస్ నాయకులు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు గాజుల వీరెందర్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిష్టారెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, రాధయ్య, నాయకులు విజయ్భాస్కర్, కనకారెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు.
జోగిపేటలో
అందోల్, జూన్ 28: జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పుట్టినరోజుని జోగిపేటలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగభూషణం, నాయకులు ఎల్లయ్య, శంకరయ్య, భూమయ్య ఉన్నారు.