నర్సాపూర్, జూన్ 28 : ప్రజా సేవే లక్ష్యంగా ముందుకెళ్లాలని 320(డీ) లయన్స్క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక లయన్స్క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహాబంధు క్లబ్లో గవర్నర్ విజిట్ నిర్వహించారు. ఈ సం దర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లయన్స్క్లబ్ ప్రతినిధులు ప్రజలను చైతన్యపరుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా సేవా కా ర్యక్రమాలు చేయాలని, ఇతర విషయాలను లయన్స్క్లబ్ కార్యక్ర మాల్లోకి తీసుకురావద్దని సూచించారు.
క్లబ్ ఆధ్వర్యం లో ఫీజింగ్ బాక్స్ను అందుబాటులో ఉంచడం, ప్రభుత్వ ద వాఖాన ఆవరణలో షెడ్డు నిర్మాణం చేపట్టడం, దవాఖానలకు ఆక్సీజన్ సిలీండర్లను సమకూర్చడం, ఇతర సేవా కార్యక్రమా లు చేయడం అభినందనీయమని అన్నారు. పైడి శ్రీధర్గుప్తా రూ.80వేలను లయన్స్క్లబ్ సేవా కార్యక్ర మాలకు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ జిల్లా అధ్యక్షుడు బుచ్చేశ్యాదవ్, కార్యదర్శి శ్రీ కాంత్, కోశాధికారి జైపాల్, ప్రతినిధులు డాక్టర్ నర్సింహారెడ్డి, అశోక్, నర్సింగరావు, శ్రీధర్గుప్తా తదితరులు పాల్గొన్నారు.