మనోహరాబాద్, జూన్ 28 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మండల కేంద్రమైన మనోహరాబాద్లోని 12వ వార్డులో అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ… గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ కోట్లాది నిధులను మంజూరు చేస్తున్నారన్నారు.
కొత్తగా ఏర్పడిన మనోహరాబాద్ మండలంలో నేడు అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్, కొత్తగా మూడు పారిశ్రామిక వాడలు, విశాలమైన బీటీ రోడ్లు, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యంతోపాటు గ్రామాల్లో కోట్లాది నిధులతో పను లు జరిగాయన్నారు. మ నోహరాబాద్ మండల కేంద్రం అభివృద్ధికి ఇటీవలే రూ. 5కోట్లు మం జూరు చేశారని తెలిపా రు. ప్రతిపక్షాలు రాజకీ య ఉనికి కోసమే ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని విమర్శిం చారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్రెడ్డి, నాయకులు జావీద్పాషా, భిక్షపతి, దశరథ, నరేందర్గౌడ్, సుధాకర్ పాల్గొన్నారు.