మెదక్ అర్బన్, జూన్25 : పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోక్సో కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా చూడాలన్నారు. ప్రతి యూనిట్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించాలని పేర్కొన్నారు. కేసుల్లో నేరస్తులకు శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలాన్నారు. ఈ కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మెదక్ డిఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి, ఏఆర్డీ. ఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.