కోహీర్, జూన్ 23: పలు రాష్ర్టాలకు చెందిన పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు గురువారం కోహీర్ను సందర్శించారు. మండలంలో ఉన్న ‘నేలతల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ’కి హర్యా నా, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ రాష్ర్టాల అధికారులు చేరుకుని వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు పనిముట్లను సబ్సిడీపై అద్దెకు ఇవ్వడం, ఎరువులను విక్రయించడంతో పాటు మొక్కజొన్న, కందుల సేకరణ, కూరగాయలు కొనుగోలు చేసి మార్కెట్లకు తరలించటం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఆయా వ్యాపారాల ద్వారా వచ్చిన లాభ, నష్టాల గురించి వారికి వివరించారు. మహిళ సంఘాల ద్వారా తమ రాష్ర్టాల్లో కూడా ఇలాంటి వ్యాపారాలను చేపట్టేందుకు మహిళలకు అవగాహన కల్పిస్తామని వారు పేర్కొన్నారు. ఉత్పత్తిదారుల సంఘం పని తీరుపై పూర్తి అగాహన పెంచుకోవాలని ఎంపీడీవో సుజాతనాయక్ వారిని కోరారు. కోహీర్ పర్యటనలో భాగంగా అద్దె పనిముట్ల కేంద్రం, మాచిరెడ్డిపల్లిలో కూరగాయల కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించారు. కార్యక్రమంలో ఐకేపీ డీఎంజీ లింగమూర్తి, ఏపీఎం సమ్మయ్య, బాబూరావు, నవీన్, చంద్రకళ, గోపాల్, శేఖర్, హన్మంతు, గాయప్ప పాల్గొన్నారు.