నర్సాపూర్, జూన్ 21 : గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ గ్రామ పరిధి దాటితే జీపీఎస్ ద్వారా ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లకు మెస్సేజ్ వస్తుందని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్లోని ఎంపీడీవో కా ర్యాలయ సమావేశ మందిరంలో డీఎల్పీవో యాదయ్య ఆధ్వర్యం లో జీపీఎస్(గ్లోబలైజేషన్ పొజిషన్ సిస్టం)పై నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 160 మంది పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సం దర్భంగా డీపీవో తరుణ్కుమార్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ను అమర్చుతున్నట్లు తెలిపారు. ట్రాక్టర్లను ప్రభు త్వ పనులకు కాకుండా సొంతానికి వాడుకున్నా.. గ్రామ పరిధి దాటినా జీపీఎస్ ద్వారా అ ధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఫోన్కు సందేశం అందుతుందని వివరించారు. ట్రాక్టర్ ఎక్కడెక్కడ తిరుగుతుందో జీపీఎస్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఇతరుల పని నిమిత్తం పంపవద్దని హెచ్చరించారు. సదస్సులో నర్సాపూర్, కౌడిపల్లి,శివ్వంపేట ఎంపీవోలు శ్రీనివాస్, మోహన్రావు, తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జీపీఎస్ పనితీరుపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
తూప్రాన్, జూన్ 21 : గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు అమర్చిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)పై తూప్రాన్ డివిజన్ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. తూప్రాన్లోని లక్ష్మి గార్డెన్స్లో నిర్వహించిన శిక్షణలో జీపీఎస్ పరికరాల అమరిక, నిర్వాహణ, పనితీరు వివరించారు. సదస్సులో డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో అరుంధతి, కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.