జహీరాబాద్, జూన్ 21: ఆచార్య జయశంకర్ సా రు ఆశయాలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ ముం దుకుపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ రైతు వేదికలో ఆచా ర్య జయశంకర్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం ఎన్నో సూచనలు, సలహాలు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్కు అండగా ఉండి ముందుకు నడిపించారన్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నరిసింహారావు ఉన్నారు.